'మా స్టార్స్ పాన్ పరాక్ స్టార్స్'.. పరువుతీసిన బాలీవుడ్ డైరెక్టర్?

Purushottham Vinay
బాలీవుడ్ సీనియర్ దర్శకుడు అయిన ప్రకాష్ ఝా అంటే తెలుగు ప్రేక్షకులకు అసలు పరిచయం లేకపోయినా కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం చాలా బాగా సుపరిచితమైన వ్యక్తి.అపహరన్, సత్యాగ్రహ, మృత్యుదంద్, రాజ్ నీతి వంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న మొత్తం 30 సినిమాలకు ఈయన దర్శకత్వం వహించాడు. అంతే కాకుండా ఆశ్రం అనే వెబ్ సిరిస్ ద్వారా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవల ఈయన దర్శకత్వం వహించిన' మత్తో కీ సైకిల్' అనే సినిమా సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల అయ్యింది.ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి థియేటర్ల వద్ద మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ప్రకాష్ ఝా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా మొత్తం ఒక సైకిల్ చుట్టూ తిరుగుతుంది. ఇక శుక్రవారం నాడు ఈ సినిమా విడుదలైన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రకాష్ ఝా బాలీవుడ్ హీరోల గురించి సంచలన కామెంట్స్ చేశాడు. ఈ సమావేశంలో ఒక విలేకరి మాట్లాడుతూ మీరు పెద్ద హీరోలతో సినిమాలు తీయకపోతే కారణమేమిటి?అని ప్రశ్నించగా..


డైరెక్టర్ ప్రకాష్ ఝా స్పందిస్తూ… బాలీవుడ్ బడా హీరోలు అందరూ పాన్ మసాలా యాడ్స్ చేయడంతో బిజీగా ఉన్నారు. ఆ పాన్ మసాలా వల్ల ప్రజలకు ఎంత హానికరం వారికి అవసరం లేదు. ఒక్కరోజు యాడ్ షూటింగ్ కోసం రూ.50 కోట్లు వస్తుంటే వాళ్ళు సినిమాలు ఎందుకు చేస్తారు అంటూ రాడ్డు లాంటి సమాధానం ఇచ్చాడు. మిగతా ఇండస్ట్రీలో వందల కోట్లు పెట్టి పాన్ ఇండియా సినిమాలో నిర్మిస్తుంటే బాలీవుడ్ హీరోలు మాత్రం పాన్ మసాలా యాడ్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.ఇక వారికి కథ వినే సమయం ఉండదు అందుకే బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా రావటం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ హీరోల గురించి ప్రకాష్ ఝా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ గురించి బాలీవుడ్ స్టార్ హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.నెటిజన్స్ మాత్రం ఈయన చెప్పింది ముమ్మాటికీ నిజం. బాలీవుడ్ హీరోలకు పాన్ మసాల యాడ్స్ మీద వున్న శ్రద్ద సినిమాల మీద లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: