మహేష్ బాబు మూవీ విషయంలో ఆ ఇద్దరు హీరోయిన్ లపై దృష్టి పెట్టిన రాజమౌళి..?

Pulgam Srinivas
దర్శకదీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన ఏ ఒక్క సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర అపజయం పాలు కాలేదు. అలా దర్శకత్వం వహించిన ప్రతి మూవీ తోను బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ ప్రస్తుతం రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం రాజమౌళి రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్ ,  ఒలీవియా మోరీస్ హీరోయిన్ లుగా ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ ని తెరకెక్కించాడు.

పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి , భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ మూవీ 'ఓ టి టి' లో విడుదల అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే రాజమౌళి తన తదుపరి మూవీ ని సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించబోతున్నాడు.  మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ పూర్తి కాగానే రాజమౌళి , మహేష్ బాబు సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మహేష్ బాబు సరసన హీరోయిన్ లుగా నటించేందుకు రాజమౌళి ఇద్దరు హీరోయిన్ లకు ప్రముఖ ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలుస్తోం.ది వారెవరో కాదు ఆలియా భట్ మరియు దీపికా పదుకొనే వీరిద్దరిలో ఎవరినో ఒకరిని మహేష్ బాబు మూవీ లో హీరోయిన్ గా తీసుకోవాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆలియా భట్ 'ఆర్ ఆర్ ఆర్' మూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: