కృతి శెట్టి ఆ విషయంలో జాగ్రత్త పడవలసిన సమయం వచ్చిందా..?

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ కృతి శెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ ఉప్పెన తోనే అదిరిపోయే బ్లాక్ పాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. అలాగే ఉప్పెన మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర కొల్ల గొట్టి ఘన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. అలాగే ఉప్పెన మూవీ తో ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది కుర్ర కారు మనసు కూడా దోచుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీ లతో వరుసగా మూడు విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకొని స్టార్ హీరోయిన్ లతో పోటీగా సినిమా అవకాశాలను దక్కించుకుంది.

ఇలా వరుస సినిమా అవకాశాలను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ది వారియర్ మూవీ తో మొట్ట మొదటి అపజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర ఎదుర్కొంది. ఈ మూవీ తర్వాత మాచర్ల నియోజకవర్గం మూవీ తో మరో అపజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర ఎదుర్కొంది. తాజాగా ఈ ముద్దు గుమ్మ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి కూడా బాక్సా ఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త నెగటివ్ టాక్ లభించింది.

వరుసగా మూడు విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మూడు మూవీ లతో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దానితో కృతి శెట్టి తన స్టోరీల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి కొన్ని రోజుల్లో కృతి శెట్టి , నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: