పంజా వైష్ణవ్ తేజ్ రెమ్యూనిరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని , మంచి క్రేజ్ ను సంపాదించు కున్నాడు. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కిన కొండపొలం అనే మూవీ లో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన కొండపొలం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ విజయాన్ని సాధించ లేక పోయింది.

ఇది ఇలా ఉంటే కొండపొలం మూవీ కి విమర్శకుల నుండి మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే తాజాగా పంజా వైష్ణవ్ తేజ్ , గిరిసయ్య దర్శకత్వంలో రొమాంటిక్ బ్యూటీ కేతుకా శర్మ హీరోయిన్ గా తెరకెక్కిన రంగ రంగ వైభవంగా అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ విజయం సాధించ లేదు. ఇది ఇలా ఉంటే ఉప్పెన మూవీ ని మినహాయిస్తే పంజా వైష్ణవ్ తేజ్ కి భారీ బ్లాక్ బాస్టర్ విజయం ఇప్పటి వరకు దక్కలేదు.

అయినప్పటికీ ఈ హీరో కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న విషయం మనకు తెలిసింది. దానితో ఈ హీరో ప్రస్తుతం ఒక్కో సినిమాకు పది కోట్ల వరకు రెమ్యూనిరేషన్ ని తీసుకుంటున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే కొంత మంది ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే 100 కోట్ల కు పైగా కలెక్షన్ లను కొల్ల గొట్టాడు.  ఆ రేంజ్ స్టామినా ఉన్న హీరోకు పది కోట్ల రెమినరేషన్ పెద్ద విషయమేమీ కాదు అని చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: