అమెరికా వెళ్లనున్న సమంత.. ఎందుకో తెలుసా...?

murali krishna
టాలీవుడ్‌ లో ఇండస్ట్రీలో సమంతకి ఉన్న క్రేజ్‌ ఎలాంటి దో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి కి భారీ క్రేజ్‌ ఉంటుంది.


నిత్యం సమంతకు సంబంధించి ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా వివాహ బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టిన తర్వాత సమంతపై షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో నే తాజాగా ఈ బ్యూటి కి సంబంధించి మరో ఆసక్తికర వార్త తెగ వైరల్‌ అవుతోంది.


పుష్ప చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ తో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న సమంత ప్రస్తుతం వరుస లతో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే ఇదే సమయం లో సమంత అమెరికాకు పయనమవుతున్నట్లు తెలుస్తోంది. సమంత స్కిన్ సంబంధిత వ్యాధి తో బాధపడుతున్నట్లు గతంలో చాలా సార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు సమంత అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. అయితే తాజాగా ఇదే విషయమై సమంత చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ కారణంగానే షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చిన సమంత.. సోషల్‌ మీడియాకు సైతం దూరంగా ఉంటూ వస్తోందని చర్చ నడుస్తోంది.


ఇంతకీ ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే సమంత స్పందిస్తే కానీ క్లారిటీ రాదు. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం తెలుగులో శాకుంతలం, యశోధతో పాటు విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ఖుషీ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు బాలీవుడ్‌లో ఓ వెబ్‌ సిరీస్‌తోపాటు హాలీవుడ్‌లో ఓ సినిమా లో నటించనున్న సంగతి తెలిసిందే.సమంత నాగ చైతన్య తో విడాకులు తీసుకున్నాక వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా వుంది. తన నటనతో అందిరిని ఎంతో కాలం నుంచి మెప్పించుకుంటూ వస్తుంది సమంత

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: