డైలమాలో డార్లింగ్ ఫ్యాన్స్..ఎందుకంటే?

Satvika
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ కూడా అనుకున్న టాక్ ను అందించలేక పోయాయి.భారీ యాక్షన్ ఉన్న కూడా హిట్ టాక్ ను అందుకోలేక పోయింది..ఇక ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ వస్తున్నాడు..ప్రస్తుతం డార్లింగ్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ 'ఆదిపురుష్' ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ తెరకెక్కించగా, ఈ సినిమాను హిస్టారికల్ సబ్జెక్ట్‌తో చిత్ర యూనిట్ రూపొందించింది. 



ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కించగా, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించింది. దీంతో ఈ టీజర్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. కాగా, దసరా కానుకగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాల్లో వార్తలు వినిపించాయి.కానీ ఆ టీజర్ మాత్రం పండుగకు విడుదల అయ్యేలా లేదని తెలుస్తుంది.



మొన్నీమధ్య ప్రభాస్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.. పెద్దనాన్న కృష్ణంరాజు మరణించారు.దాంతో చిత్రయూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆదిపురుష్ చిత్రం నుండి దసరాకు రావాల్సిన టీజర్‌ను ఇప్పట్లో రిలీజ్ చేసేలా కనిపించడం లేదట. దీంతో ప్రభాస్ అభిమానులు మరోసారి డైలమాలో పడిపోయారు. ఆదిపురుష్ నుండి అప్డేట్ వస్తుందని ఎదురుచూసిన తమకు మరోసారి నిరాశే మిగలనుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరి నిజంగానే ఆదిపురుష్ నుండి రావాల్సిన ట్రీట్ వాయిదా పడిందా అనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.. ఈ వార్త ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: