మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ఆలియాభట్..!

Pulgam Srinivas
దర్శక ధీరుడు రాజమౌళి ఈ సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించి 1100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర కొల్ల గొట్టింది.ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో లుగా నటించగా , ఆలియా భట్ , ఒలీవియా మోరిస్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు.

ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత దర్శకదీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కబోయే మూవీ కి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ పూర్తి కాగానే రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్ లో తేరకేక్కబోయే మూవీ ప్రారంభం కాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో తేరకేక్కబోయే మూవీ భారీ బడ్జెట్ తో తేరకేక్కబోతున్నట్లు సమాచారం. రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్ లో తేరకేక్కబోయే సినిమా మహేష్ బాబు కు పెరియర్ పరంగా 29 వ సినిమా.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటించనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే తాజాగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో అలియా భట్ , రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో ఆలియా భట్ పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: