SSMB 29 మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటూ గత పదేళ్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ షూటింగ్‌లో ఇటీవలే జాయిన్ అయ్యారు. ఈ మూవీ కోసం మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఆ తర్వాత రాజమౌళితో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా ఎలాంటి నేపథ్యంలో తెరకెక్కనుందనే విషయాన్ని రాజమౌళి వెల్లడించారు.ఇక ఈ సినిమాను ఏకకాలంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్‌తో షూట్ చేయనున్నారట. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళికి హాలీవుడ్‌లో మంచి పాపులారటీ వచ్చింది. ఈ నేపథ్యంలో మహేష్ సినిమాను ఇండియన్ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా షూటింగ్ చేస్తారట.


అలాగే మిగతా భాషాల్లో SSMB 29 డబ్ చేస్తారట. దీనికి సంబంధించి  వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా హిందీ నటి దీపికా పదుకొనె ఫైనల్ అయ్యినట్టు సమాచారం తెలుస్తోంది. ఆమె ఇప్పటికే xXx: ది రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ అనే ఓ హాలీవుడ్ సినిమాలో నటించడంతో కొంత ప్లస్ అవుతుందని ఆమెను చిత్రబృందం ఓకే చేసినట్లు సమాచారం తెలుస్తోంది.ఇక ఈ సినిమా ఆఫ్రికా ఖండం నేపథ్యంలో ఒక భారీ సాహసంతో కూడిన థ్రిల్లర్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై దర్శకుడు రాజమౌళి ఈ సినిమా నేపథ్యాన్ని వెల్లడించారు. మహేష్ బాబుతో చేయబోయే సినిమాను లోకం చుట్టిన వీరుడు నేపథ్యంలో భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. దీంతో మహేష్ బాబు అభిమానులు ఈ వార్తను సోసల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: