Sri రెడ్డి పులస కూర మాములుగా వండలేదుగా...!!

murali krishna
శ్రీ రెడ్డి.. ఈ అమ్మడు ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్‌తో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలపై సంచలన కామెంట్స్ చేస్తూ అందరిని కూడా ఆశ్చర్యపరిచింది.


శ్రీరెడ్డి ఇప్పటికీ కూడా ఏదో సంచలన కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది. యూట్యూబ్‌లో శ్రీరెడ్డి ఏ చిన్న వీడియో షేర్ చేసిన కూడా లక్షల్లో ప్రేక్షకులు అయితే చూస్తున్నారు. ఇటీవల జరుగుతున్న ప్రచారం ప్రకారం శ్రీరెడ్డి నెలకు 7 నుండి 8 లక్షల రూపాయలు సంపాదిస్తుందట. శ్రీరెడ్డి యూట్యూబ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ భారీగా సంపాదిస్తూ పాపులారిటీని కూడా దక్కించుకుంది.


శ్రీ రెడ్డి ఒకవైపు అందాలు ఆరబోస్తూ రకరకాల వంటలు కూడా చేస్తూ అలరిస్తుంది. ఇటీవల కాలంలో శ్రీ రెడ్డి పీతలు, రొయ్యలు, ఎండుచేపలు వంటి పల్లెటూరి వంటలు చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తుంది. బిర్యానీ చేసే విధానం.. వంటింటి చిట్కాలకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో పోస్టు చేసిందట.. తాజాగా ఈ అమ్మడు పదివేలు పెట్టి పులస చేప కొని మసాలాలు దట్టించి చేపల పులుసు వండిందట.. శ్రీ రెడ్డి పులస చేపల కూర అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వంట వండుతూనే శ్రీ రెడ్డి పలు విషయాల గురించి కూడా చెప్పుకొచ్చింది.


శ్రీరెడ్డి తాను చేస్తున్న వంట వీడియోలకు కాస్త అందాలతో కూడా గార్నిష్ చేస్తోంది. ఆ మధ్య నల్లి బొక్కల కూర కూడా వండింది. తెలంగాణ ప్రజల కోసం ఇది చేసానంటూ చెప్పుకొచ్చిన శ్రీ రెడ్డి.. ఇది తింటే రాత్రి మూలగాల్సిందే అని చెప్పుకొచ్చిందట.. దీంతో ఈ వీడియోని జనాలు పిచ్చిపిచ్చిగా చూసేసారట.. ప్రతి వీడియోలను ఏదో ఒక కొత్త దనం చూపిస్తూ శ్రీరెడ్డి తెగ రచ్చ చేస్తుంది. మొత్తానికి శ్రీరెడ్డి చేస్తున్న రచ్చకు తెలుగు రాష్ట్రాలు అయితే షేక్ అయిపోతున్నాయి. శ్రీరెడ్డి ఒకవైపు యూట్యూబ్‌లో సందడి చేస్తూనే సెలబ్రిటీలపై విరుచుకుపడుతూనే ఉంది. ఆ మధ్య లైగర్ చిత్ర టీంపై దారుణమైన విమర్శలు కూడా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: