పారితోషికం పెంచేసిన.. కండక్టర్ ఝాన్సీ.. రోజుకు ఎంతో తెలుసా?
సోషల్ మీడియానే తన ఆయుధంగా మార్చుకుంది. ఈ టీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ లో తన డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా ఓవర్ నైట్ లో సెలబ్రిటీ గా మారిపోయింది అని చెప్పాలి. షోలో పల్సర్ బైక్ పాటకు తనదైన శైలిలో మార్పులు చేసి అందర్నీ ఆకట్టుకుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి రాకముందు ఝాన్సీ అంటే కేవలం చుట్టుపక్కల వారికి మాత్రమే తెలుసు. శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఝాన్సీ పర్ఫామెన్స్ చేసిన తర్వాత అందరికీ సుపరిచితురాలిగా మారిపోయింది. మరిన్ని షోలలో కూడా పర్ఫార్మెన్స్ చేసేందుకు అవకాశాలు అందుకుంటోంది.
ఈ క్రమం లోనే అందరిలాగానే పాపులారిటీ వస్తూ ఉండటంతో పారితోషకం కూడా పెంచేసింది అన్నది తెలుస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి రాకముందు ఝాన్సీ ఒక రోజుకి ఐదు వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునేది. కానీ పల్సర్ బైక్ పాట ద్వారా బాగా పాపులారిటీ సంపాదించిన జానీ ఝాన్సీ ఇక ఇప్పుడు ఒక రోజుకి యాభై వేలు పారితోషికం డిమాండ్ చేస్తుందట. ఉద్యోగానికి కూడా లాంగ్ లీవ్ పెట్టి టీవీ షోల్లో పర్ఫామెన్స్ చేస్తూ భారీగా సంపాదిస్తుంది అని తెలుస్తుంది. ఇక ఇదే క్రేజ్ కొనసాగితే మాత్రం ఆమె తన ఉద్యోగాన్ని వదిలేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని తెలుస్తుంది..