ఆ స్టార్ హీరో సీక్రెట్ చెప్పిన బాలీవుడ్ ముద్దుగుమ్మ..!!

Divya
తెలుగులో స్టార్ హీరోగా ప్రభాస్ కు ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు.. అయితే ఆ తర్వాత నటించిన ప్రభాస్ ఏ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.కానీ కలెక్షన్ల పరంగా మాత్రం బాగానే రాబట్టుకున్నాయి. ప్రభాస్ కు ఇంత గర్వం లేకపోవడంతో డౌన్ టు ఎర్త్ హీరో అని ఇండస్ట్రీలో బాగా టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటూ ఉంటాడు ప్రభాస్. ఇక కొద్ది రోజుల క్రితం ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఆయన చూడడానికి వచ్చిన అభిమానుల కోసం ప్రభాస్ అంతటి విషాదంలో ఉన్నా కూడా అభిమానుల కోసం భోజనం ఏర్పాటు చేసి అందరిని కదిలించారని చెప్పవచ్చు.

ఇక ప్రభాస్ వ్యక్తిగతంగా ఎంత గొప్ప మనసొ మరొకసారి రుజువు చేసుకున్నారు. ఇదంతా ఇలా ఉండగా బాలీవుడ్ హీరోయిన్ తాజాగా ప్రభాస్ పై పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక బాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతిససన్ ప్రభాస్ పై ఇలా మాట్లాడడం జరిగింది. ప్రభాస్ తో కలిసి ఈమె ఒక మైథాలజికల్ చిత్రమైన ఆదిపురుష్ చిత్రం లో నటించింది. ఈ సందర్భంగా కృతి సనన్ మాట్లాడుతూ.. నేను సినిమా షూటింగ్ సెట్ లో ఉన్నప్పుడు ప్రభాస్ ను మొదటిసారి చూసినప్పుడు తను చాలా సిగ్గుపడ్డారు. ఈ విషయం తెలుసుకొని షాట్ మధ్యలో బ్రేక్ లో ప్రభాస్ ను కలుసుకున్న తర్వాత వెంటనే తనతో ఫ్రీగా మాట్లాడడం మొదలు పెట్టారని. ప్రభాస్ అంత త్వరగా ఫ్రీగా మాట్లాడి అందరితో కలిసి పోతారని తన ఊహించలేదని తెలిపింది. నిజంగానే ప్రభాస్ ఒక స్వీట్ పర్సన్ అలాంటి వ్యక్తితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందని కృతి సనన్ తెలిపింది. అంతేకాకుండా ఆది పురుష్ చిత్రంలో సీత పాత్ర కోసం హెల్ప్ చేశారని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: