హీరో కూతురితో రామ్ చరణ్ పెళ్లి ఎలా ఆగిపోయిందంటే?

Purushottham Vinay
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకడిగా దూసుకుపోతున్నాడు. ఇక ఈయన సతీమణి ఉపాసన కూడా సోషల్ మీడియాలో బాగా ఫేమస్.మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంటలలో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఈ జంటని చూసినప్పుడల్లా ఇంత ప్రేమగా ఉంటె ఎంత బాగుంటుందో అని అసూయ పడిన జంటలు ఎన్నో ఉన్నాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు..వీళ్లిద్దరి మధ్య దాంపత్య సంబంధం ఏర్పడి పదేళ్లు దాటింది..2012 జూన్ 14 వ తారీఖున వీళ్లిద్దరి పెళ్లి అతిరథ మహారధుల సమక్షం లో అంగరంగ వైభవం గా జరిగింది..ప్రస్తుతం ఈ దంపుతులిద్దరికి త్వరలో వారసుడు లేదా వారసురాలు రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇందులో ఎంత వరుకు నిజం ఉందొ తెలియదు కానీ, రామ్ చరణ్ తో ఉపాసన పెళ్లి ఫిక్స్ కాకముందు చాలా హై డ్రామానే నడించిందట.వాటికి సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో చాలా కాలం తర్వాత బయటపడి తెగ హల్చల్ చేస్తున్నాయి.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రామ్ చరణ్ కి తొలుత వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత తో పెళ్లి చేద్దాం అనుకున్నారట.


చిరంజీవి ఇంకా వెంకటేష్ ఇద్దరు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్.వీళ్లిద్దరి మధ్య దశాబ్దాల నుండి మంచి సన్నిహిత సంబంధం ఉంది.ఆ చొరవ తోనే వెంకటేష్ గారు స్వయంగా ఈ విషయాన్నీ ప్రస్తావించారట.చిరంజీవి కూడా ఎంతో సంతోషించి వెంటనే ఒప్పుకున్నాడట.ఈ విషయాన్నీ రామ్ చరణ్ కి చెప్పగా, అప్పుడు రామ్ చరణ్ ఉపాసన తో తనకి ఉన్న ప్రేమ వ్యవహారం ని బయటపెట్టాడట.ఇదే విషయాన్నీ వెంకటేష్ కి చెప్పగా ఆయన కూడా చాలా తేలికగా పర్లేదు పిల్లల ఇష్టాఇష్టాలను దాటి మనం ఏమి చేయలేము కదా అని సర్ది చెప్పుకున్నాడట..అలా చిరంజీవి ఇంకా దగ్గుపాటి కుటుంబాలు ఒకటయ్యే ఛాన్స్ మిస్ అయ్యింది.వెంకటేష్ తన పెద్ద కూతురు ఆశ్రితా కి 2019 వ సంవత్సరంలో అతిరధ మహారధుల సమక్షం లో ఘనంగా పెళ్లి చేసాడు.ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తన 15 వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి దిల్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది దిల్ రాజు బ్యానర్లో 50 వ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: