పెద్దమ్మ, చెల్లెల్ల కోసం ఆ డెసిషన్ తీసుకున్న డార్లింగ్?

Purushottham Vinay
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన బాహుబలి సినిమాతో ఏకంగా పెద్ద పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.బాహుబలి సినిమా తర్వాత ఈయన నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇంకా అలాగే రాబోతున్నాయి కూడా. ఇకపోతే ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ప్రభాస్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.ప్రభాస్ తన అభిమాన హీరోగా ఇంకా అలాగే ఎంతో ఆరాధ్య దైవంగా భావించే ఆయన పెదనాన్న కృష్ణంరాజు మరణించడంతో ప్రభాస్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇంకా కృష్ణంరాజు గారి మరణం మొత్తం ఇండస్ట్రీకి తీరని లోటుగా ఏర్పడింది. ఇలా కృష్ణంరాజు మరణించడంతో ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు.


కృష్ణంరాజు మరణించకపోయి ఉంటే ఇప్పటికే ఈయన నటిస్తున్నటువంటి ప్రాజెక్ట్ కే, సలార్ సినిమాలు కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం అయ్యేవి. అయితే కృష్ణంరాజు గారి మరణంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.అయితే కృష్ణంరాజు గారు మరణించిన అనంతరం ఈయన సినిమా షూటింగ్లో పాల్గొంటారని భావించినప్పటికీ ప్రభాస్ మాత్రం సినిమా షూటింగ్ ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ నెలలో ప్రారంభం కావాల్సిన కొత్త షెడ్యూల్ చిత్రీకరణను ఈ నెల మొత్తం వాయిదా వేస్తున్నట్లు సమాచారం.ఈ నెలరోజుల పాటు ప్రభాస్ తన పెద్దమ్మకు చెల్లెళ్లకు తోడుగా ఉండాలని భావించారట.అందుకే ఈ సమయంలో తాను షూటింగ్ లో పాల్గొనడం సరైనది కాదని భావించిన ప్రభాస్ ఈనెల మొత్తం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ నెలలో ప్రారంభం కావాల్సిన ప్రాజెక్ట్ కే, సలార్ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్స్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: