ఈ రెండు తమిళ సినిమాలు హిట్ కొట్టేనా!!

P.Nishanth Kumar
ఈ నెలలో రెండు తమిళ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. కొన్ని ప్రత్యేకమై న తమిళ చిత్రాల కు తెలుగు లో మార్కె ట్ ఎప్పు డూ ఉంటూ నే ఉంటుంది. హీరోతో సంబంధం లేకుండా ఆ చిత్రాలు కంటెంట్ ద్వారానే ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంటా యి. ఆ విధంగా ఇప్పుడు ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఓ రెండు సినిమాలు అందరిలో ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. వాటిని చూడడానికి ప్రేరేపిస్తున్నాయి.

తమ అప్డేట్ల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి విడుద ల కావడం తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా వాటికి మంచి పోటీ ఏర్పడింది అని చెప్పాలి. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ చిత్రం తెలుగులో కూడా అదే పేరుతో విడుదల కాబోతుంది విక్రమ్ కార్తీ జయం రవి ఐశ్వర్య రాయ్ త్రిష భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మంచి అంచనాలే ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని బాహుబలి సినిమాతో పోల్చడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందిఅని చెప్పాలి.

మరి మణిరత్నం చాలా రోజుల తర్వాత భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఇకపోతే కోలీవుడ్ నుంచి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్న మరొక సినిమా ముత్తు. శింబు హీరోగా నటించిన ఈ సినిమాకు గౌతం మీనన్ దర్శకత్వం అందిస్తున్నారు. చాలా రోజుల తర్వాత వీరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై తమిళనాడు తో పాటు తెలుగులో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల కాలంలో తెలుగులో విడుదలైన తమిళ చిత్రాలు పెద్దగా తమ సత్తా చాటని నేపథ్యంలో ఈ సినిమాలు అయినా తమిళ సినిమా పరిశ్రమలోని సినిమాలకు మంచి పేరు తీసుకు వస్తాయా అనేది చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: