సెల్ఫీ అడిగితే ఫోన్ లాక్కొని అభిమానిపై సీరియస్ అయిన రానా దగ్గుబాటి..?

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి  పేరు ప్రఖ్యాతలు మరియు గుర్తింపు  సంపాదించుకున్నటువంటి వారిలో దగ్గుబాటి కుటుంబం ఒకటి. ఇక ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి  పేరు ప్రఖ్యాతలు మరియు గుర్తింపు సంపాదించుకున్న దగ్గుబాటి ఫ్యామిలీ నేడు తిరుమలలో సందడి చేశారు.ఇకపోతే సురేష్ బాబు ఆయన సతీమణి అలాగే ఆయన కుమారులు దగ్గుబాటి  రానా దంపతులు,దగ్గుబాటి   రానా సోదరుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే నేడు ఉదయం వీఐపీ విరామ సమయంలో వీరంతా స్వామివారి దర్శనం చేసుకున్నారు.ఇక  ఆలయ అధికారులు వీరికి ప్రత్యేకంగా స్వాగతం పలకడమే కాకుండా స్వామివారి దర్శనం అనంతరం పండితులు వీరికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

అయితే ఇలా స్వామివారి దర్శనం అనంతరం దగ్గుబాటి  రానా ఆయన సతీమణి మీహిక ఆలయం వెలుపలకు రావడంతో ఒక్కసారిగా మీడియా వారిపై ఫోకస్ చేశారు.ఇక ఈ క్రమంలోనే ఓ అభిమాని ఆలయ ప్రాంగణంలో రానాతో సెల్ఫీ తీసుకోవడం కోసం ఎగబడ్డారు. అయితే ఇలా హీరో దగ్గుబాటి  రానాను సెల్ఫీ అడగడంతో రానా ఏకంగా తన అభిమాని మొబైల్ ఫోన్ లాక్కొని సీరియస్ అవుతూ ఆలయ ప్రాంగణంలో వద్దు అంటూ తనపై సీరియస్ అయ్యారు. కాగా తిరిగి తన అభిమాని ఫోన్ తనకు ఇచ్చేశారు.అంతేకాదు రానాతో పాటు ఉన్నటువంటి సిబ్బంది తనని వెనక్కి పంపించారు. 

ఇకపోతే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే  ఈ వీడియోలో మనం దగ్గుబాటి రానా దంపతులను మాత్రమే కాకుండా సురేష్ బాబు దంపతులను కూడా చూడవచ్చు. ఇక ఇలా కుటుంబ సభ్యులందరూ కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఇదిలావుంటే గత కొద్దిరోజులుగా దగ్గుబాటి  రానా దంపతుల విడాకులు తీసుకొని విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇక ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదని ఈ దగ్గుబాటి దంపతులు ఎప్పటికప్పుడు తమ గురించి వచ్చే వార్తలను కొట్టి పారేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: