వైరల్ అవుతున్న బండ్ల గణేష్ వ్యాఖ్యలు...!!

murali krishna
ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన బండ్ల గణేష్ ఆ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో కెరీర్ ను కొనసాగించారు. పలువురు స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించిన బండ్ల గణేష్ ఆ సినిమాలలో కొన్ని సినిమాలతో సక్సెస్ ను సొంతం చేసుకుంటే మరికొన్ని సినిమాలతో ప్లాప్ రిజల్ట్స్ ని అందుకున్నారు..
టెంపర్ సినిమాతో నిర్మాతగా భారీ సక్సెస్ ను అందుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్నారు.
ఆ తర్వాత పవన్ తో ఒక సినిమాను నిర్మించాలని బండ్ల గణేష్ ప్లాన్ చేసినా వేర్వేరు కారణాల వల్ల ఆ సినిమా వర్కౌట్ కాలేదు. రాజకీయాలలో కూడా బండ్ల గణేష్ సక్సెస్ కావాలని అనుకున్నా కొన్ని కారణాల వల్ల పాలిటిక్స్ లో ఆయనకు అనుకూల ఫలితాలు రాలేదు. సరిలేరు నీకెవ్వరు, డేగల బాబ్జీ సినిమాలలో బండ్ల గణేష్ నటించినా ఈ సినిమాలలో ఆయన పాత్రలకు మంచి పేరు రాలేదనే సంగతి తెలిసిందే.
అయితే పవన్ కు భక్తుడైన బండ్ల గణేష్ తాజాగా ఒక సంచలన పోస్ట్చే యగా ఆ పోస్ట్సో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బండ్ల గణేష్ సోషల్ప మీడియాలో వేర్వేరు సందర్భాలలో దిగిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు తాజాగా కాలుమీద కాలు వేసుకుని సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఆ పోస్ట్ లో ఫోటోలతో పాటు 'నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర.. దయచేసి నేర్చుకోండి ఆచరించండి అది మన ధర్మం' అని పేర్కొన్నారు.
బండ్ల గణేష్ చేసిన పోస్ట్కు  5500కు పైగా లైక్స్ వచ్చాయి. బండ్ల గణేష్ పోస్ట్ గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ బండ్ల గణేష్ పోస్ట్గు రించి స్పందిస్తారేమో చూడాలి. బండ్ల గణేష్ సంస్కారం అనే పదానికి బదులుగా నమస్కారం అనే పదం వాడారని కొంతమంది కామెంట్లు చేస్తుండగా అనవసర వివాదాల్లోకి పవన్ ను లాగవద్దని మరి కొందరు సూచనలు చేస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: