' కార్తీకేయ 'ను రంగంలోకి దించిన 'జక్కన్న '....!!

murali krishna
డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో హీరోలు సైతం సినిమా తీయడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ బాబు 29వ సినిమానీ తెరకెక్కించేందుకు పలు సన్నాహాలు కూడా చేస్తున్నారు రాజమౌళి.
భారతీయ సినిమాలో అత్యధికంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు.. ఇంతవరకు రాజమౌళికి అపజయం లేదని కూడా చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇక మహేష్ బాబు తో రాజమౌళి ఇలా.. ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేయడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి అభిమానులలో.
 
వాస్తవానికి కొన్ని సంవత్సరాల క్రితమే మహేష్, రాజమౌళి కాంబినేషన్లో సినిమా చర్చలు జరిగాయి. అయితే కొన్ని సినిమాల కమిట్మెంట్ల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైనట్లుగా తెలుస్తుంది. rrr వంటి సినిమా విజయం తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా ఇది కావడంతో సినీ అభిమానులలో మరింత ఆసక్తి నెలకొంది. మహేష్ బాబు ని ఎలా చూపిస్తారు.. రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తారని మహేష్ అభిమానుల సైతం నెట్టింట ఎన్నో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక అద్భుతమైన అడ్వెంచర్ మూవీను తెరకెక్కించబోతున్నట్లు హింట్ ఇవ్వడం జరిగింది.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి.. మహేష్ బాబు తో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కించబోతున్నట్లు తెలియజేశారు. దీంతో అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఉన్నారు. ఇక ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రాజమౌళి కుమారుడు కార్తికేయ వ్యవహరిస్తున్నాడు. తాజాగా మహేష్ అభిమానులకు హైప్ ఇచ్చే విధంగా.. కార్తికేయ #”GLOBETROTTER” అనే పోస్ట్ చేయడం జరిగింది.. ప్రస్తుతం కార్తికేయ చేసిన ఈ పోస్ట్వై రల్ అవ్వడమే కాకుండా ట్రెండీగా మారుతుంది. ఇక దీంతో అభిమానులు సైతం ఈ సినిమాకి అప్పుడే ప్రమోషన్స్ సైతం మొదలు పెట్టారేమో అన్నట్లుగా కామెంట్ చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: