ఆ ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్న హను రాఘవపూడి..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడి గా తన కంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదిం చుకున్న దర్శకుల లో హను రాఘవపూడి ఒకరు . హను రాఘవపూడి 'అందాల రాక్షసి' మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు . ఆ తర్వాత కృష్ణ గాడి వీర ప్రేమ గాధ  , లై ,  పడి పడి లేచే మనసు తాజాగా సీతా రామం మూవీ లకు దర్శకత్వం వహించాడు . తాజాగా విడుదలైన సీతా రామం మూవీ బాక్సా ఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించి అద్భుత మైన కలెక్షన్ లను కూడా బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది .

ఇది ఇలా ఉంటే సీతా రామం మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న హను రాగవపూడి తన తదుపరి మూవీ ని మల్టీ స్టారర్ మూవీ గా తెరకెక్కించ బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది . ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే కథ తో హను రాగవపూడి తన తదుపరి మూవీ ని తెరకెక్కించ నున్నట్లు తెలుస్తుంది . హను రాగవపూడి తెరకెక్కించ బోయే మల్టి స్టారర్ మూవీ లో నాని మరియు శర్వానంద్ లు కనిపించ బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది .

ఇది వరకే నాని హీరో గా తెర కెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు . అలాగే శర్వానంద్ హీరోగా తెరకెక్కిన పడి పడి లేచే మనసు మూవీ కి హను అనురాగపడి దర్శకత్వం వహించాడు. ఇలా ఈ ఇద్దరు హీరోలతో కూడా దర్శకుడు హను రాఘవపూడి కి మంచి సన్నిహిత్యము ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: