క్రేజీ కాంబో: అల్లు అర్జున్ కి విలన్ గా దగ్గుబాటి రానా..?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో కొన్ని  కాంబినేషన్ లు చాలా బాగుంటాయి.అయితే... ఎలా అంటే ఆ కాంబోలు చూసే సినిమా థియేటర్స్ కి జనాలు వెళ్తారు. ఇక అలాంటి కాంబోలు రాజమౌళి - ఎన్టీఆర్, సుకుమార్ -బన్నీ ,పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్..ఇక ఇలాంటి కాంబొలు తెరపై కనిపిస్తే కచ్చితంగా ఇప్పడాల్సిందే. అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. అంతలా తమ మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు.కాగా  రీసెంట్గా మరో కొత్త బ్లాస్టింగ్ కాంబోకి తెర తీశాడు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు.ఇదిలావుంటే ప్రజెంట్ మహేష్ బాబు తో ఎస్ ఎస్ ఎం బి 28 అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాసరావు.. ఈ సినిమా అయిపోగానే పవన్ కళ్యాణ్ తో మరో సినిమా కమిట్ అయ్యాడంటూ వార్తలు వచ్చాయి. 

అయితే  ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ప్రజెంట్ త్రివిక్రమ్ తో సినిమా చేయలేనని ..కరాకండిగా చెప్పేసారట. ఇక దీంతో మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు.. ఇప్పుడు హీరో బన్నీపై పడ్డాడు. అయితే బన్నీ పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే.. ఆయనతో కలిసి మరో క్రేజీ సినిమాను తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పురాణాలపై ఉండబోతున్నట్లు తెలుస్తుంది.అయితే  అసలే పురాణాలపై పట్టు ఉన్న త్రివిక్రమ్ పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టాలంటే ఇలాంటి మైధలాజికల్ సినిమానే కరెక్ట్ అంటున్నారు జనాలు .

ఇకపోతే  ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించాలని ఆయన ట్రై చేస్తున్నారట.కాగా  ఈ సినిమా గురించి అదిరిపోయే బ్లాస్టింగ్ అప్డేట్ ఏంటంటే ..ఈ సినిమాలో బన్నీకు విలన్ గా హీరో రానా దగ్గుబాటి నటించబోతున్నాడట.ఇక  ఈ విషయం తెలుసుకున్న బన్నీ అభిమానులు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు .అంతేకాదు కచ్చితంగా రానా విలన్ అంటే ఆ సినిమా గురించి మనం ఇంకా అసలు ఊహించుకో అక్కర్లేదు.. బాహుబలి, భీంలా నాయక్ లాంటి సినిమాలే మనకు కనిపిస్తాయి. ఇక దీంతో ఇప్పటికే ఈ ప్రాజెక్టు పై బన్నీ రానా ఇద్దరు సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ..రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: