పవన్ వల్ల ఇబ్బంది పడుతున్న సాయి ధరమ్ తేజ్!!

P.Nishanth Kumar
కొన్నిసార్లు కొంతమంది హీరోలు తప్పు చేశామని చాలా ఆలస్యంగా తెలుసుకుంటూ ఉంటారు. ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు  బాగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అప్పుడే సదరు సినిమాలలో ఒప్పుకుని దానిని అనుకున్న సమయంలో పూర్తి చేసి విడుదల చేయగలగాలి. అలా అన్ని కలిసి వస్తేనే ఏదైనా సినిమా విడుదలయ్యి సూపర్ హిట్ అవుతుంది. ఆ విధంగా ఇటీవల కాలంలో బైక్ యాక్సిడెంట్ కి గురై చాలా సమయాన్ని కోల్పోయి మళ్ళీ సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్న సాయి ధరం తేజ్ ఇప్పుడు తన తదుపరి సినిమా చేయడం పట్ల కొంత ఇబ్బంది పడుతూ ఉండడం మెగా అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది .

కార్తీక్ దండు అని దర్శకుడుతో కలిసి ఓ సినిమాను తొందరలోనే మొదలుపెట్టబోతున్న ఈ హీరో అదే కాకుండా ఇప్పుడు మరో చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను తొందరలోనే మొదలు పెట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం ఈ సినిమా ఇంకా మొదలు కాకపోవడం ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది. తాజాగా వినిపిస్తున్న వార్తలు ఈ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెబుతున్నారు

 ఈ చిత్రంలో ఆయన మరొక హీరోగా కూడా నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన ఈ సినిమాను చేయడానికి డేట్లు ఇవ్వకపోవడం అది సాయి ధరం తేజ్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని చెబుతున్నారు. మరి హరిహర వీరమల్లు సినిమా యొక్క షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఈ సినిమాను చేసి సాయి ధరం తేజ్ ను హీరోగా నిలబెడతాడు చూడాలి. ఓ తమిళ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఆక్సిడెంట్ వల్ల కొన్ని రోజులు కోల్పోయిన సాయి ధరమ్ తేజ్ మళ్లీ కం బ్యాక్ చేయాలి అంటే భారీ విజయాలను అందుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఆలోచించి ఆయన ఈ సినిమాను మొదలు పెట్టగా ఈ విధంగా అయిపోవడం అది నిరాశ పరిచే విషయం అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: