ఆ సోషల్ మీడియా అమ్మాయిని.. ఎవరు వదలట్లేదుగా?

praveen
ఒకప్పుడు బుల్లితెర కార్యక్రమాలపై కనిపించాలన్న.. వెండితెరపై అవకాశాలు దక్కించుకోవాలి అన్నా ఎంతో కష్టం అని అనుకునే వారు ఎంతోమంది. కానీ ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో  అసాధ్యం అనుకున్నది కాస్తా ప్రస్తుతం సులభతరంగా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు బుల్లితెర  కార్యక్రమాలలో చాన్స్ రావాలి అంటే బాగా సర్కిల్ వుండాలి అని అనుకునేవారు..  ఇక మరోవైపు వెండితెరపై ఛాన్స్ రావాలంటే సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండాలి అనుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా లో పాపులర్ అయిన వారు ఎక్కువగా సినిమాలో కనిపిస్తున్నారు.

 మొన్నటికి మొన్న సినిమా రివ్యూలు చెబుతూ బాగా ఫేమస్ అయిన ఒక యువకుడు బుల్లితెర తో  పాటు అటు సినిమాల్లో కూడా అవకాశాలు దర్శించుకుంటున్నాడు అనే విషయం తెలిసిందే.  ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాను ఒక యువతి బాగా ఊపేస్తోంది. బంగారం ఒకటి చెప్పనా అంటూ  విచిత్రమైన డైలాగ్ చెప్పి తన హావభావాలతో అందరినీ నవ్విస్తుంది. ఈ క్రమంలోనే ఆ యువతి సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. దీంతో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించిన ఆ యువతిని బుల్లితెర ఛానల్లో నిర్వాహకులు అందరు కూడా అస్సలు వదలడం లేదు.

 తమ ఛానల్ లో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పిలవడం ఆ యువతితో డైలాగులు చెప్పించడం రేటింగులు పెంచుకోవడానికి ప్రయత్నాలు  చేస్తున్నారు. ఇప్పుడు జబర్దస్త్ నిర్వాహకులు కూడా ఇలాంటిదే  చేశారు అని చెప్పాలి. ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ప్రోమో చూసుకుంటే  బంగారం ఒకటి చెప్పనా అనే డైలాగుతో ఫేమస్ అయిన యువతి చంటి స్కిట్ లో భాగంలో కనిపించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో చెప్పిన డైలాగ్ స్టేజిపై కూడా చెప్పి అందరినీ కడుపుబ్బ నవ్వించింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: