"శర్వానంద్ - అమల" మధ్య సెంటిమెంట్ పండింది ?
కథ విషయానికి వస్తే సినిమా ప్రస్తుతం లో ముగ్గురు స్నేహితులు వివిధ సమస్యలతో జీవితాన్ని గడుపుతుంటారు. అయితే ఒక శాస్త్రవేత్త సహాయంతో మళ్ళీ గతంలోకి వెళ్లి వారి జీవితాలను గొప్పగా మార్చుకోవాలన్నది వారి ఆలోచన. కానీ ఈ ముగ్గురు స్నేహితులతో మన హీరో శర్వానంద్ మాత్రం కొంచెం సెంటిమెంట్ గా అలోచించి అప్పటికే చనిపోయిన తన అమ్మ ప్రాణాలను కాపాడాలని అనుకుంటాడు. అలా మొదలైన సినిమా ఎన్ని మలుపులు తీసుకుంది ? ముగ్గురి ఆశయాలు తీరాయా ? అన్నది మంచి ప్లాట్ అని చెప్పాలి. ఇందులో దర్శకుడి ప్రతిభను మెచ్చుకోవాల్సిందే.
శర్వానంద్ మరియు అమ్మగా నటించిన అమల మధ్యన వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా అమల తన నటన మరియు నవ్వు తో సినిమాను ఒక లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక వెన్నెల కిషోర్ మరియు ప్రియదర్శి ల కామెడీ చాలా బాగా వర్క్ అవుట్ అయింది. సినిమాకు టాక్ పరంగా బాగున్నా ఇది వసూళ్లను సాధించడంలో ఎంతవరకు ప్లస్ అవుతుందో తెలియాల్సి ఉంది.