ప్రత్యేక పూజలు జరిపించిన సమంత.. నెట్టింట్లో ఫోటోలు వైరల్..!!

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా వుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే సమంత జూలై నెల చివరి వారంలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొంది.ఇక  ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఎక్కడా కనిపించలేదు.అయితే  దీంతో ఆరోగ్యం గురించి రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి.ఇకపోతే కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి సమంత తల్లి రెండో వివాహం చేసుకోమని ఒత్తిడి తీసుకు రావడంతో సమంత గర్భసంచి తీయించుకోవడానికి సిద్ధమైందని అసలు తీయించుకుందని కూడా ప్రచారం జరుగుతోంది. 

ఇక దీంతో ఇటీవల సమంత మేనేజర్ మీడియాకు ఒక నోట్ రిలీజ్ చేస్తూ ఆమె అనారోగ్యంగా ఉందన్న వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే  ఇక ఆమె త్వరలోనే అన్ని పుకార్లకు బ్రేక్ వేస్తారని కూడా పేర్కొన్నారు.ఇదిలావుంటే ఇక  గత కొన్నాళ్లుగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న సమంత అనూహ్యంగా ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇక అనూహ్యంగా ఈరోజు తెల్లవారుజామున సికింద్రాబాద్ లోని ఒక వేద పాఠశాలలో సమంత ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది.ఇక  దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే  ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారని తెలుస్తోంది.ఇక  ఈ ఫోటోలలో కొంత మంది పూజారులు అలాగే వేద పాఠశాల విద్యార్థులు కనిపిస్తుండగా వారి మధ్యలో సమంత కుర్చీలో కూర్చొని కనిపిస్తుంది.ఇకపోతే స్వతహాగా క్రిస్టియన్ అయినా సరే నాగచైతన్య వివాహం చేసుకున్న తర్వాత సమంత హిందూ మతానికి సంబంధించి కూడా కొన్ని ఆచారాలు, వ్యవహారాలు పాటిస్తూ ఉండేది. అయితే నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడానికంటే ముందు కూడా ఆమె తిరుమల వెంకన్నను దర్శించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే  ఇక ఈ రోజు ఆమె ప్రత్యేక పూజలు పాల్గొన్నారని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: