బాయ్ కాట్ ట్రెండ్ పై రణ్ బీర్ షాకింగ్ కామెంట్స్.. షంషేరా ఫెయిల్యూర్ కి అదే రీజన్ అంటూ..?

Anilkumar
బాలీవుడ్ స్టార్ కపుల్  అయిన రణ్‌బీర్, అలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ఇప్పుడు వీరు  జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “బ్రహ్మాస్త్ర”. ఇక అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మూడు భాగాలుగా విడుదలవుతుంది.అయితే మొదటి భాగం “బ్రహ్మాస్త్ర-శివ” ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంకాగా గత కొంతకలంగా బాలీవుడ్ కి గడ్డు కాలం నడుస్తుండడంతో ఈ మూవీతో ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని మూవీ టీం ప్రమోషన్స్ తో సినిమాని ప్రేక్షకుల దగ్గరకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది.ఇదిలావుంటే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ సినిమాని నార్త్ లో రిలీజ్ చేస్తుండగా..

సౌత్ లో దర్శకధీరుడు రాజమౌళి రిలీజ్ చేస్తున్నాడు. అయితే  సినిమా కథాంశం మొత్తం భారతీయ హిందూ ఇతిహాసాల్లో ఉన్న అస్త్రాలు చుట్టూ తిరుగుతుందని మూవీ మేకర్స్ ఇప్పటికే పలు ప్రచార చిత్రాలతో చెప్పుకొచ్చింది.ఇక ఈ  సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ముఖ్య పాత్రలు చేస్తుండగా నాగిని ఫేమ్ నటి మౌనిరాయ్ విలన్ గా నటిస్తుంది.ఇక అసలు విషయానికి వస్తే బాయ్‌కాట్ ట్రెండ్ పై తాజాగా ఒక ఇంటర్వ్యూలో రణ్‌బీర్ స్పదింస్తూ.. “సినిమాలో కంటెంట్ లేకపోవడంతోనే ప్రేక్షకులు థియేటర్ లకు రావడం లేదు. అయితే ఇటీవల విడుదలైన నా షంషీరా మూవీపై ఎటువంటి వ్యతిరేకత లేదు అయినా సినిమా ఆడలేదు.

  కారణం సినిమాలో కంటెంట్ లేకపోవడమే, అంతేగాని మరే కారణం లేదు”. అని మీడియా విలేకర్లతో వెల్లడించారు.ఇక షంషేరా సినిమాలో రణబీర్ కపూర్ మొదటిసారి ద్విపాత్రాభినయం పోషించారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ సినిమాను విలన్ గా నటించాడు.ఇక రణబీర్ కపూర్ ఈ సినిమాలో కంటెంట్ లేదని స్వయంగా ఒప్పుకోవడమే కాకుండా  బాయ్‌కాట్ పై ఇలా పాజిటివ్ గా స్పదించి ప్రేక్షకులని థియేటర్ కి రంపించే ప్రయతనం చేస్తున్నారు. చూడాలి మరి ఇక ఈ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: