రష్మీపై వైష్ణవ్ తేజ్ షాకింగ్ కామెంట్స్.. అంత మాట అనేశాడేంటి..?

Anilkumar
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.అంతేకాదు  ఆ ఫ్యామిలీ తర్వాతనే ఎవరైనా.అయితే  ఇప్పటికీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీనే టాప్ లో ఉంది.ఇక మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే ఎంత మంది ఇండస్ట్రీలోకి వచ్చినా.. మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్, ఫాలోయింగ్ వేరు.మరీ  ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినీ అభిమానులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇకపోతే  మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా ఇండస్ట్రీకే ఒక దారి చూపారు.అంతేకాదు  సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు.

ఇక  ఆ తర్వాత మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవి పేరు చెప్పుకొని చాలామంది ఇండస్ట్రీలో అడుగుపెట్టారు కానీ..అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవ్వగలిగారు. అయితే అందరూ సక్సెస్ కాలేకపోయారు. ఇదంతా కట్ చేస్తే చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వైష్ణవ్ తేజ్.. ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీని షేక్ చేశాడు.ఈయన  ఒక్క సినిమాతోనే అతడికి సూపర్ డూపర్ క్రేజ్ వచ్చింది.అంతెందుకు  ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయిపోయాడు.ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం ప్లాఫ్ అయ్యాయి. ఇదిలావుంటే ఇటీవల రంగ రంగ వైభవంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్ తేజ్..

ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ రష్మీపై కామెంట్స్ చేశాడు.ఇకపోతే మీ సినిమాలో ఐటెం సాంగ్ చేయాలని అనుకుంటే.. ఏ హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకుంటారు.. అంటూ యాంకర్ వైష్ణవ్ ను అడిగారు.ఇక  దీంతో ఏమాత్రం ఆలోచించకుండా.. వైష్ణవ్ తేజ్ మాత్రం టక్కున యాంకర్ రష్మీ అని చెప్పేశాడు. అంతేకాదు రష్మీలో హాట్ ఎక్స్ ప్రెషన్స్ పలికించే తీరు అతడికి బాగా నచ్చుతాయట. అయితే అందుకే రష్మీ అయితే ఐటెమ్ సాంగ్ కు బాగుంటుందని చెప్పుకొచ్చాడు వైష్ణవ్ తేజ్. అదేంటి.. వైష్ణవ్ అలా సమాధానం చెప్పాడు.. అంటూ ఆయన రష్మీ గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తన వచ్చే సినిమాలో అయినా రష్మీకి వైష్ణవ్ చాన్స్ ఇస్తాడేమో చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: