వాడికి అవకాశం ఇప్పించింది నేనే.. కానీ ప్రమోషన్స్ కి రాలేదు : శర్వానంద్

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యువ హీరోలలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది కొంతమంది మాత్రమే. తమ కథలు ఎంపిక తో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి విజయాలు అందుకున్న యువ హీరోలు కొంతమంది. ఈ కొంతమందిలో వినిపించే పేరు శర్వానంద్.  ఏదైనా సినిమా తీస్తున్నాడు అంటే చాలు అది రొటీన్కు భిన్నంగా ఉంటుందని తెలుగు ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. కథలో బలం ఉంటేనే అటు శర్వానంద్ సినిమాకు ఓకే చెబుతాడు అని ఎంతో మంది ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు.

 రొటీన్ సినిమాల జోలికి పోకుండా వైవిధ్యమైన సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతాడని.. అభిమానులు కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే శర్వానంద్ సినిమా అంటే చాలు థియేటర్కు వెళ్లి చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. గత కొన్ని రోజుల నుంచి ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ సరైన విజయాన్ని అందుకోలేక పోతున్నాడు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. శర్వానంద్, రీతువర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది.

 సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శర్వానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ వారే హీరో అనుకునీ పని చేశారని చెప్పుకొచ్చాడు. ఒక ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి ప్రేక్షకుల్ని ఈ సినిమా తీసుకెళ్తుందని తెలిపాడు. అమల గారితో వర్క్ చేయడం కష్టంగా అనిపించలేదు అని.. తన అమ్మతో పని చేసినట్లు అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు. వెన్నెల కిషోర్ పై కాస్త ఫన్నీ కౌంటర్ వేసాడు. వాడు ప్రమోషన్ కి రమ్మంటే రాలేదు.. వాడికి సినిమా ఇప్పించింది నేనే.. వాడి సంగతి వచ్చాక చెబుతాను అంటూ నవ్వులు పూయించాడు హీరో శర్వానంద్. మేమందరం కథను నమ్మి ఈ సినిమా చేశామని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: