'ఒకే ఒక జీవితం' మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించగా , రీతూ వర్మ ఈ మూవీ లో శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించింది. అక్కినేని అమల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా , ప్రియదర్శి , వెన్నెల కిషోర్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ని సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్త బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది.
 

ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై కూడా సినీ ప్రేమికుల్లో అంచనాలు పెరిగాయి. టైమ్ ట్రావెలర్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా ఈ సినిమా బృందం ఒకే ఒక జీవితం మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి క్లీన్ 'యు' సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా వరస అపజయాలను బాక్సా ఫీస్ దగ్గర ఎదుర్కొంటున్న శర్వానంద్ ఈ మూవీ తో తిరిగి బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటాడో ... లేదో ... చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో హీరోయిన్ గా నటించిన రీతూ వర్మ కూడా ఆఖరుగా నటించిన వరుడు కావలెను మూవీ తో బాక్సాఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. ఈ ముద్దు గుమ్మ కూడా ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: