నరేష్ ఇకపై దానిమీదే ఫోకస్ పెట్టినట్లున్నాడే!!

P.Nishanth Kumar
కొంతమంది హీరోలు ఒకే జోనర్ లో సినిమాలు చేయడం వల్ల వారికి ఆ సినిమా ల ద్వారా వచ్చిన పాపులారిటీ తగ్గిపోయింది. దాంతో వారు సమయానికి తగ్గట్లుగా సినిమాలు చేయడం మార్చేసి ఇప్పుడు ఇంతటి పెద్ద స్టార్స్ గా ఎదగగలిగారు. అలా తొలినుంచి కామెడీ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంతో అలరించి పెద్ద హీరో గా మారిపోయాడు అల్లరి నరేష్. అయితే ఈ సినిమాలు ప్రేక్షకులు మెచ్చకపోవడంతో అల్లరి నరేష్ సినిమా కెరియర్ దాదాపుగా అంతమైపోయిందనే అందరు అనుకున్నారు.
 కానీ అల్లరి నరేష్ ఇప్పుడు ఈ స్థాయి లో ఉన్నాడు అంటే మళ్ళీ వరుస సినిమా అవకాశాలను అందుకోగలుగుతున్నాడు అంటే దానికి కారణం  నాంది సినిమా వల్లనే అని చెప్పాలి. కామెడీ సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరించే నరేష్ అవే సినిమా లతో అందరినీ ఎంతగానో బోర్ కొట్టించాడు. దాంతో ఈ సీరియస్ జోనర్ లో సినిమా చేసి ప్రేక్షకులను అబ్బురపరిచారు.  తన రెగ్యులర్ జోనర్ కాకుండా ఎప్పుడైతే నాంది లాంటి వెరైటీ కథ ఉన్న సినిమా చేశాడో అప్పుడే ఆయన విజయ యాత్రకు నాంది పలికిందని చెప్పాలి.
అలా అప్పటినుంచి ఈ హీరో వరుస వెరైటీ సినిమాలను చేస్తూనే ఉంటాడు.  నాంది సినిమా సాధించిన విజయం అల్లరి నరేష్ కెరీర్ ను నిలబెట్టిందని తప్పకుండా చెప్పవచ్చు. లేదంటే ఇప్పుడు ఈ హీరో మహర్షి సినిమాలో లాగా ప్రత్యేక పాత్ర లు చేసుకునే వాడు. ఆ విధంగా ఈ సినిమాతో దర్శకుడుగా సక్సెస్ అయ్యి విజయ కనకమేడల మంచి క్రేజ్ ను ఏర్పరచుకున్నాడు. తాజాగా వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తున్నాడు. ఉగ్రమ నే సినిమాను వీరిద్దరూ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది. అయితే అల్లరి నరేష్ వరుసగా ఇలాంటి సీరియస్ జోనర్ లోని సినిమాలు చేయడం నిజంగా మంచి విశేషం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: