ఆది సాయికుమార్ 'క్రేజీ ఫెలో' మూవీ టీజర్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు ఆయన ఆది సాయి కుమార్ 'ప్రేమ కావాలి' మూవీ తో వెండితెరకు పరిచయం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న ఈ హీరో ఆ తరువాత లవ్లీ మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే లవ్లీ మూవీ తర్వాత అనేక మూవీ లలో హీరోగా నటించిన ఆది సాయి కుమార్ కు ప్రేమ కావాలి , లవ్లీ రేంజ్ విజయాలు మాత్రం బాక్సా ఫీస్ దగ్గర ఇప్పటి వరకు తక్కలేదు.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఆది సాయి కుమార్ తిస్ మర్ ఖాన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో పాయల్ రాజపుత్  హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఇలా తిస్ మర్ ఖాన్ మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన ఆది సాయి కుమార్ మరి కొన్ని రోజుల్లో క్రేజీ ఫెలో మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. క్రేజీ ఫెలో మూవీ లో ఆది సాయి కుమార్ సరసన దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్‌ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌ పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ మూవీ ని నూతన దర్శకుడు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టీజర్ విడుదల తేదీని చిత్రం బృందం ప్రకటించింది. సెప్టెంబర్ 1 వ తేదీన ఉదయం 10:08 గంటలకు ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బంధం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: