'ఎన్ బి కే 107' కి అదే హైలెట్ అంట..!

Pulgam Srinivas
నందమూరి నరసింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా పూర్ణ కీలక పాత్రలో ఎస్ ఎస్ తమన్ సంగీత సారథ్యంలో తేరక్కెక్కి డిసెంబర్ 2 వ తేదీ న విడుదల అయిన అఖండ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా 100 కోట్ల కు పైగా కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర కొల్ల గొట్టింది.

ఇలా అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తేరక్కెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 107 వ సినిమాగా తిరక్కెక్కుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి ఒక టీజర్ ను మూవీ యూనిట్ విడుదల చేయగా , ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి అదిరి పోయే రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ లో శృతి హాసన్ , బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.

వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉండగా , దునియా విజయ్ ఈ మూవీ లో ప్రతి నాయకుడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ క్లైమాక్స్ సన్నివేశానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ క్లైమాక్స్ సన్నివేశంలో బాలకృష్ణ కు సంబంధించి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది అని ,  ఆ ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది అని తెలుస్తోంది. అలాగే ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఈ మూవీ కే  హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: