అల్లరి నరేష్ 'ఇట్లు మారేడిపల్లి ప్రజానీకం' మూవీ షూటింగ్ పూర్తి..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో కెరీర్ ప్రారంభం లో కామెడీ చిత్రాలలో హీరోగా నటిస్తూ ఎంతో మందిని అలరించి , ఆ తర్వాత కొన్ని వైవిధ్యమైన పాత్రలలో నటించి నటుడి గా కూడా అద్భుతమైన గుర్తింపు ను తెచ్చుకున్న అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి నరేష్ 'అల్లరి' మూవీ తో తన కెరీర్ ని మొదలు పెట్టాడు. మొదటి మూవీ లోనే అద్భుతమైన నటన తో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఆ తర్వాత ఎన్నో కామెడీ మూవీ లలో హీరోగా నటించి , ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అలా కామెడీ మూవీ లతో కెరీర్ ను కొనసాగిస్తున్న అల్లరి నరేష్ 'గమ్యం' మూవీ లో ఒక అద్భుతమైన పాత్రతో ప్రేక్షకులను తన నటనతో కట్టి పడేసాడు.
 

అలాగే కొంత కాలం క్రితం విడుదల అయిన నాంది మూవీ లో కూడా అల్లరి నరేష్ తన నట విశ్వరూపం చూపించాడు. నాంది మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అలాగే నంది మూవీ లో అల్లరి నరేష్ నటన కు ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం' అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం  మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఏఆర్ మోహన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించిన , ఈ మూవీ కి శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. మరి అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం' మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: