తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సక్సెస్ అయిన హీరో మాస్ మహారాజా రవితేజ.ఈయన కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన రవితేజ..ఇక ఆ తరువాత హీరోగా సూపర్ సక్సెస్ అయ్యారు. ఇకపోతే టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రవితేజతో పాటు తన ఇద్దరు సోదరులు భరత్, రఘులు కూడా సినిమాలు చేసిన వారే. అయితే ఇక మాస్ మహారాజా తరహాలో వారు ఆకట్టుకోలేకపోయారు. పోతే రవితేజ కుమారుడు మహాధన్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
అయితే ఇప్పటికే మహాధన్ తండ్రితో కలిసి ఓ సినిమాలో నటించాడు కూడా. ఇక ఇదిలా ఉంటే మహాధన్ కంటే ముందుగా రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. పోతే అతనే రవితేజ తమ్ముడు రఘు తనయుడు మాధవ్.ఇకపోతే 21 ఏళ్ల మాధవ్ ఏయ్ పిల్లా సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం కానున్నాడు. ఇక దీనికి దర్శకుడు రమేశ్ వర్మ కథ అందిస్తుండగా.. లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రుబల్ షెకావత్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇదిలావుంటే ఇక గతంలో లక్ష్మి, లక్ష్యం, రేసుగుర్రం వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన నల్లమలుపు బుజ్జి లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇకపోతే తాజాగా ఏ పిల్లా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. అయితే ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మాధవ్ ఫస్ట్ లుక్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నటించడానికి ముందే మాధవ్ డ్యాన్స్, ఫైట్స్, హార్స్ రైడింగ్లో శిక్షణ తీసుకున్నాడు. అంతేకాదు అలాగే నటనకు సంబంధించి శిక్షణను కూడా పూర్తి చేశాడు. మాధవ్ డెబ్యూ ఫిల్మ్ కి సంబంధించిన బాధ్యతలు రవితేజనే దగ్గరుండి చూసుకున్నారట. అయితే కథ కూడా ఆయన ఓకే చేశాకే పట్టాలెక్కిందట.అయితే మరి మాస్ మహారాజా తరహాలో మాధవ్ ఎలా ఆకట్టుకుంటాడోనని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు మూవీ మేకర్స్...!!