టాలీవుడ్లో ఒకప్పుడు హీరోగా బాగా రాణించిన వేణు తొట్టెంపూడి గురించి మనకి తెలిసిందే . అయితే ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలకు, కుటుంబ కథా చిత్రాలకు..దర్శక నిర్మాతలకు మంచి ఆప్షన్ గా ఉండేవారు. అయితే 'స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే లాంటి సినిమాలన్నీ వేణుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.కాగా 'రామాచారి వీడో పెద్గగూఢ చారి' వేణు ఆఖరుగా తెరపై కనిపించిన చిత్రం.ఇక దీని తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు వేణు.అయితే రీసెంట్ గా 'రామారావు ఆన్డ్యూటీ' చిత్రంలో పోలీస్ పాత్ర చేసినప్పటికీ అతడి రీఎంట్రీ ప్రయత్నం వృధా అయింది.
ఇక అయినప్పటికీ.. వేణును మరో క్రేజీ ఆఫర్ వరించినట్టు సమాచారం అందుతోంది.ఇదిలావుంటే ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలోని సినిమా త్వరలో సెట్స్పైకి వెళ్ళనున్న సంగతి తెలిసిందే.కాగా SSMB 28 గా పిలుచుకుంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించబోతున్న సంగతి తెలిసిందే.పోతే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మించబోతున్నారు.ఇక ఈ సినిమాకి 'అర్జునుడు' అనే టైటిల్ ను ఖాయం చేస్తున్నట్టు ఇదివరకు వార్తలొచ్చాయి.అయితే ఇందులో వేణు తొట్టెంపూడికి త్రివిక్రమ్ కీలక పాత్రను ఆఫర్ చేశారట. నిజానికి హీరోగా వేణు తొలి చిత్రం 'స్వయంవరం' కు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు.
ఇక అందులోని త్రివిక్రమ్ డైలాగ్స్ ఓ రేంజ్లో పేలాయి. పోతే ఆ తర్వాత వేణు నటించిన 'చిరునవ్వుతో' చిత్రానికీ త్రివిక్రమ్ కలం కదిలించారు. ఇక ఈ సినిమా కూడా అప్పట్లో సూపర్ హిట్టయింది. అయితే ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్ డైరెక్టోరియల్ మూవీలోనే వేణు నటించనుండడం విశేషంగా మారింది.ఇక అతడు , ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న ఈ మూడో చిత్రానికి భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇకపోతే 'అరవింద సమేత వీరరాఘవ', 'అల వైకుంఠపురము' లో చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న త్రివిక్రమ్ ఈ సారి కూడా మహేశ్ ను యాక్షన్ హీరోగా ప్రెజెంట్ చేయబోతున్నట్టు సమాచారం. కాగా స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసి.. చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కించే పనిలో ఉన్నారు త్రివిక్రమ్.అయితే మరి ఈ సినిమాతో అయినా వేణు.. టాలీవుడ్ లో నటుడిగా బిజీ అవుతారేమో చూడాలి..!!