రెండు తెలుగు రాష్ట్రాల్లో 'కార్తికేయ 2' టికెట్ ధరలు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన నిఖిల్ ఆఖరుగా అర్జున్ సురవరం మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అర్జున్ సురవరం లాంటి మంచి విజయవంతమైన సినిమా తరువాత చాలా కాలం గ్యాప్ తర్వాత నిఖిల్ 'కార్తికేయ 2' మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ మూవీ లో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా , చందు మొండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. కార్తికేయ 2 మూవీ చాలా కాలం క్రితం విడుదలై మంచి విజయం అందుకున్న కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కింది. అలా చాలా కాలం క్రితం విడుదలై మంచి విజయం సాధించిన కార్తికేయ మూవీ కి కార్తికేయ 2 మూవీ సీక్వెల్ గా తెరకెక్కడంతో కార్తికేయ 2 మూవీ పై నిఖిల్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీన విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తెలుసుకుందాం.  

కార్తికేయ 2 మూవీ టికెట్ ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మల్టీప్లెక్స్ థియేటర్ లలో 177 రూపాయలు గాను , సింగిల్ థియేటర్ లలో 147 రూపాయలు గాను ,  తెలంగాణ రాష్ట్రంలో మల్టీప్లెక్స్ థియేటర్ లలో 200 రూపాయలు గాను సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో 150 రూపాయలు గాను ఉండనునట్లు తెలుస్తోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: