స్టేజ్ మీద ఖుష్బూని చూసి.. తెగ నవ్వుకున్న జడ్జి ఖుష్బూ?

praveen
బుల్లితెరపై ఎన్నో రకాల కామెడీ షోస్ ప్రసారం అవుతూ ఉంటాయి. అయితే ఇక ఈ కామెడీ షోస్ అన్నింటిలో కూడా నెంబర్వన్ ఏది అంటే బుల్లితెర ప్రేక్షకులు అందరూ చెప్పేది జబర్దస్త్ అని. ఎందుకంటే తొమ్మిదేళ్ల నుంచి జబర్దస్త్ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్విస్తూనే ఉంది. సినిమాల్లో దొరకని ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు అందిస్తూ టాప్ రేటింగ్  సొంతం చేసుకుంటుంది అని చెప్పాలి. ఇలా  వచ్చిన కొంత కాలం లోనే నవ్వులకు చిరునామా గా మారిపోయింది జబర్దస్త్ కార్యక్రమం.

 ఇకపోతే జబర్దస్త్ ప్రారంభం అయిన నాటి నుంచి జడ్జిగా కొనసాగుతున్న ఒకప్పటి హీరోయిన్  ప్రస్తుత పొలిటీషియన్ రోజా కు మంత్రి పదవి వచ్చిన కారణంగా బాధ్యతలు పెరగడంతో చివరికి జబర్దస్త్ నుంచి తప్పుకుంటు నిర్ణయం తీసుకుంది. అయితే ఇక రోజా వెళ్లిపోయిన తర్వాత ఇంద్రజ జడ్జిగా రాగా ఇటీవలే ఒకప్పటి అందాల హీరోయిన్ కుష్బూ కూడా జబర్దస్త్ లో జడ్జిగా ఎంట్రీ ఇవ్వడం ఎంతో మందిని ఆకర్షించింది.. ఈ క్రమంలోనే ఖుష్బూని చూడటానికి కూడా ఎంతో మంది జబర్దస్త్ చూస్తున్నారు అని చెప్పాలి.

 ఇక ఇటీవల ఎక్స్ ట్రా జబర్దస్త్  కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. స్టేజ్ మీద ఉన్న కుష్బూని చూసి జడ్జి సీట్లో ఉన్న కుష్బూ తెగ నవ్వుకుంది అనే చెప్పాలి. అర్థం కాలేదు కదా ఇంతకీ ఏం జరిగిందంటే.. కిరాక్ కార్తీక్ టీం స్కిట్ లో భాగంగా నరేష్ కుష్బూ పాత్రలో ఎంట్రీ ఇస్తాడు. ఇక ఇది చూసి జడ్జి సీట్లో ఉన్న కుష్బూ  ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదే సమయంలో తన వెంట్రుకలను నిమురుతూ ఎంతో రొమాంటిక్గా కుష్బూ అంటూ చెబుతాడు నరేష్. దీంతో ఇది చూసి జడ్జి సీట్లో కూర్చున్న కుష్బూ  తెగ నవ్వుకుంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: