పవన్ కళ్యాణ్, అనుష్క కాంబినేషన్లో రావాల్సిన సినిమా అలా మిస్సయ్యిందా..?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కల్యాణ్  ప్రస్తుతం సినిమాల పనిలో ఫుల్ బిజీగా వున్నాడు. అయితే ఇక ఆయన నటించిన సినిమా వస్తుందంటే చాలు..ఆయన అశేష అభిమానులు ఆ పిక్చర్ చూసేందుకు ఆత్రుతతో ఎదురు చూస్తారు. ఇకపోతే  ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతీ ఒక్క హీరోయిన్ అనుకుంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఇదిలావుంటే ఓ కార్యక్రమంలో తాను పవన్ కల్యాణ్ తో యాక్ట్ చేయాలని అనుకుంటున్నానని అనుష్క శెట్టి చెప్పింది.కాగా అది జరగలేదు.ఇకపోతే నిజానికి పవన్ కల్యాణ్-అనుష్క జంటగా ఫైనల్ అయి ఒక సినిమా రావాల్సింది. 

అయితే  అది ఎక్కడ ఆగిపోయిందో ఇక్కడ తెలుసుకుందాం. ఇక పవన్ కల్యాణ్ తో 'సుస్వాగతం' చిత్రం తీసిన దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు ఆ తర్వాత ఆయనతో 'అన్నవరం ' ఫిల్మ్ చేశాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా భీమినేని ..అనుష్కను ఫిక్స్ అయ్యారు.అయితే  కానీ, అప్పటికే చిరంజీవి 'స్టాలిన్' పిక్చర్ లో అనుష్క ఓ సాంగ్ చేసింది. ఇక దాంతో నెక్స్ట్ ఆప్షన్ గా ఆసిన్ ను అనుకున్నాడు దర్శకుడు.ఇక అలా అనుష్క స్థానంలో హీరోయిన్ గా ఆసిన్ వచ్చింది. అయితే అలా పవన్ కల్యాణ్ కు జోడీగా 'అన్నవరం'లో ఆసిన్ నటించింది.

పోతే అలా ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం అనుష్కకు మిస్ అయింది.ఇక  చెల్లి సెంటిమెంట్ ప్రధాన అంశంగా తెరకెక్కిన ఈ మూవీలో సంధ్య..పవన్ కల్యాణ్ చెల్లెలిగా నటించింది. అయితే శివబాలాజీ సంధ్యకు జోడీగా నటించాడు. కాగా ఈ పిక్చర్ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు.అంతేకాదు ఎమోషనల్ సీన్స్ లో పవన్ కల్యాణ్ యాక్టింగ్ చాలా బాగుందని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి.అయితే మొత్తంగా సినిమా మాత్రం యావరేజ్ అని కొందరు అభిప్రాయపడ్డారు. ఇకపోతే పవన్ కల్యాణ్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడనే అభిప్రాయం కూడా వ్యక్తమయింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: