రణవీర్ నగ్న ఫోటోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన సింగర్ చిన్మయి..?

Anilkumar
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఇటీవల ఓ మ్యాగజైన్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నగ్నంగా ఫోటోషూట్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఇది కాస్త సంచలనమైంది. అయితే ఎంతలా ఆ ఫోటోలు వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇకపోతే ఈ ఫోటో షూట్ కోసం రూ.55 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.అయితే ఈ ఫోటోల పై నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అనే విషయం అందరికీ తెలిసిందే.ఇదిలావుంటే అనూహ్యంగా కొంతమంది రణ్‌వీర్‌ గట్స్ ను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో  కూడా వేశారు.
ఇక ఇలాంటి వాటిపై పాజిటివ్ గాను కాకుండా నెగిటివ్ గాను కాకుండా.. ద్వంద్వార్థం ప్రతిబింబించేలా కామెంట్లు చేయడం రాంగోపాల్ కు అలవాటు అన్న సంగతి తెలిసిందే.ఇకపోతే ఆయన కూడా రణ్‌వీర్‌ సింగ్‌ నగ్నంగా చేసిన ఫోటో షూట్ పై స్పందించాడు. అయితే రణ్‌వీర్‌ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నట్టు కామెంట్లు చేయడం మొదలుపెట్టిన వర్మ..ఇక అటు తర్వాత ఆడవాళ్లు కూడా ఇలా చేస్తే ఇంతే మద్దతు ఇవ్వాలి, అప్పుడే సమానత్వం అన్నది ఉన్నట్టు అంటూ వర్మ పేర్కొన్నాడు. ఇదిలావుంటే ఇక తాజాగా చిన్మయి రణ్‌వీర్‌ నగ్నంగా చేసిన ఫోటో షూట్ పై స్పందించింది. ఇక  మాట్లాడుతూ 'మీకు బుద్దుందా? పనీ పాట లేదా? ఇలాంటి వేస్ట్ కేసులు వేసి కోర్టు టైం వేస్ట్ చేస్తున్నారేంటి. 

అంతేకాదు రేప్ లు చేస్తూ దర్జాగా తిరుగుతున్న రాజకీయ నాయకులను ముందు టార్గెట్ చేయండి.అంతేకాదు ఆడవాళ్ల మధ్యలో డ్యాన్సులు వేసే సీఎంలు, మహిళలను వేధించే ఎంపీ లు చాలా మంది ఉన్నారు.ఇక  ముందు వాళ్ళ పై కేసులు వేయండి.అయితే  ఇదంతా జనాల అటెన్షన్ కోసమే' అంటూ ఆమె పేర్కొంది. ఇకపోతే నిజానికి చిన్మయి ఇలాంటి వాటిని అస్సలు సమర్ధించదు.  అంతేకాదు కాదు ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇలాంటి వాటిని అస్సలు పట్టిచుకోదు.ఇకపోతే ఇప్పుడు ఈ ఫోటోల గురించి ఆమె ఓ నెగిటివ్ కామెంట్ వేస్తే..ఇక  ఇంకా ఇంకా ఈ ఫోటోల పై ఏదో ఒక కామెంట్ చేయాల్సి వస్తుందని ఆమె భావించినట్టు ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: