ఇది చాలదా బాలయ్యకి అభిమానులు పై ఎంత ప్రేమో చెప్పడానికి..?

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, హిందూపురం ఎమ్మెల్యేగా గుర్తింపు సంపాదించుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు తాజాగా మరొకసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఒక సామాన్య అభిమానిని గుర్తు పెట్టుకున్న బాలకృష్ణ ఆయనకు ఫోన్ చేసి మరి తన దగ్గరకు పిలిపించుకొని అతని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు దీంతో బాలయ్య అభిమానులు మా బాలయ్య మంచి మనసున్న వ్యక్తి అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకున్నది ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బాలకృష్ణ షూటింగ్ మొత్తం ఎక్కువగా ఇప్పుడు రాయలసీమ పరిసర ప్రాంతాలలోనే జరుగుతున్నది. ఈ సందర్భంగా నజాద్ హుస్సేన్ మాట్లాడుతూ సామాన్యమైన వ్యక్తులు అయిన మాలాంటి వారితో బాలకృష్ణ కలిసి భోజనం చేయడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అని తెలియజేశారు. ఇది బాలకృష్ణ గొప్పతనానికి నిదర్శనం అనే విధంగా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా అభిమానులను అభిమానించే ఏకైక నటుడు బాలకృష్ణ మాత్రమే అని తెలియజేశారు ఆ వ్యక్తి తమకు బాలయ్య బాబు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఇదే అని తమ జీవితంలో ఇది మరిచిపోమని ఆ కుటుంబం అంతా ఆనందాన్ని తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ NBK -107 సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు అయినా కూడా అభిమానుల కోసం తన సమయాన్ని కేటాయించి అక్కడ వారితో బాగా కలిసిపోవడంతో ఇటు బాలకృష్ణ అభిమానుల సైతం చాలా ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఇక చివరిగా అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. బాలకృష్ణ సరసన శృతిహాసన్ నటిస్తున్నది. ఇక ఇవే కాకుండా బాలకృష్ణ పలు సినిమాలకు కమిట్ అవ్వడం గమనార్హం. ప్రస్తుతం బాలకృష్ణ ఒక చిత్రానికి రూ.15 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: