ట్రోలింగ్ కి గురవుతున్న అనసూయ.. కారణం..?

Divya
జబర్దస్త్ యాంకర్ అనసూయ పై ప్రస్తుతం దారుణమైన ట్రోల్స్ వినిపిస్తున్నాయి. అనసూయ జబర్దస్త్ ను వీడిపోతుంది అనే విషయంలో ఎన్నో రోజుల నుండి సోషల్ మీడియాలో ఈ వార్త వినిపిస్తూనే ఉన్నది. అయితే ఈ వారం ఎపిసోడ్ తో అనసూయ జబర్దస్త్ గుడ్ బై చెప్పబోతోంది అంటూ అధికారికంగా ప్రోమోతో క్లారిటీ ఇవ్వడం జరిగింది. జబర్దస్త్ షో ఇదే చివరి ఎపిసోడ్ అంటూ తాగుబోతు రమేష్ కూడా ఒక స్కిట్ చేయడం జరిగింది. ఈ స్కిట్ తో అంతా కూడా కన్నీరు మున్నిరు అవ్వడం జరిగింది.
ముఖ్యంగా జడ్జ్ ఇంద్రజ కూడా చాలా ఎమోషనల్ అయ్యింది. ఇక దీంతో ఆమె కన్నీరు ఆగకపోవడంతో చివరికి వెళ్లి అనసూయను హత్తుకొని మరి ఏడ్చింది. ఇక చంటి కూడా మాట్లాడుతూ నెలలో కనీసం మూడు రోజులు మా కోసం కేటాయించలేవా అనే ప్రశ్నను వేయడం జరిగింది. ఎంతోమంది కూడా అనసూయ యాంకర్ గా ఉండాలని రిక్వెస్ట్ చేశారు కానీ తప్పని పరిస్థితిలో అనసూయ అక్కడి నుంచి వెళ్లిపోవలసి వస్తోందని చెప్పకనే చెప్పేసింది. అయితే ఇంతమంది ఆ షోలో కన్నీళ్లు పెట్టుకున్న కూడా అనసూయ మాత్రం కనీసం తన కళ్లల్లో నుంచి నీళ్లు కూడా రాలేదు.
ఇక అంతేకాకుండా అనసూయ పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు తన తల్లి దగ్గర ఉంచి వచ్చారు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అనే ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదు. అయితే ఎన్నో రకాలుగా కూడా ప్రశ్నలు వేసిన ఆమె కనీసం స్పందించకుండా నవ్వుతూనే ఉన్నది. అందరూ ఏడుస్తున్న అనసూయ మాత్రం నవ్వుతూ కనిపించడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు దీంతో కొంతమంది నెటిజన్లు సైతం ఇది చాలా విడ్డూరంగా ఉంది అంటూ ఆసంతృప్తిని తెలియజేస్తున్నారు. అనసూయకు కాసింత బాధ కూడా కనిపించడం లేదని పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. దీంతో పలువురు నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: