నానితో ఢీ కొట్టబోయే ఆ లేడీ విలన్ ఎవరంటే..?

Divya
హీరో నాని రీసెంట్ గా విడుదలైన చిత్రం అంటే సుందరానికి.. ఈ సినిమా బాగానే ఆకట్టుకున్నప్పటికీ పెద్దగా కలెక్షన్ పరంగా అంతగా రాబట్ట లేకపోయింది. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాని డైరెక్టర్ చేశారు ఈ సినిమా జూన్ 10వ తేదీన విడుదల ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.. ఇక మైత్రి మూవీ సంస్థకు కూడా నాని ఈ సినిమాతో నిరాశ మిగిల్చిందని చెప్పవచ్చు ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత నాది తన పాత్రకు పూర్తి భిన్నంగా దసరా సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో కొత్త దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.

ఎస్ ఎల్ పి సినిమా బ్యానర్ పై ఈ సినిమా నిర్మించడం జరుగుతుంది. ఇందులో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తున్నది. ఈ సినిమా పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో కొనసాగుతుంది. అందుకోసం హీరో నాని తెలంగాణ స్లాంగ్ లో డైలాగు చెప్పడానికి ఆ భాషను కూడా నేర్చుకున్నారు. చిత్రంలో నాని చాలా రఫ్ క్యారెక్టర్లు కనిపించబోతున్నారు. ఈ సినిమా మొత్తం ఒక కోల్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కించడం జరుగుతోంది. ఒక వర్గం నుండి ఈ సినిమాలో ఒక వార్త వినిపిస్తోంది.. అదేమిటంటే.. సింగరేణి కాలరీస్ బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నిర్మించబోతున్నట్లు సమాచారం.
ఇక ఇటీవలే అందుకు సంబంధించి సెట్టింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరొకసారి ఆసక్తికరమైన విషయం బయటకు రావడం జరిగింది ఇందులో హీరోయిన్ పూర్ణ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లుగా సమాచారం అయితే తనది పూర్తిగా నెగటివ్ పాత్ర అని.. ఈ సినిమాలో తెలుస్తోంది. ఈమె ఈ సినిమాలో లేడీ విలన్ గా కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. దసరా షూటింగ్లోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇలాంటి హీరో సినిమాలకు విలన్ అంటే సెట్ అవుతుందా అనే అనుమానాలు నాని అభిమానులకు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో ఉండడంతో విలన్ గా పూర్ణ కాకుండా వరలక్ష్మీ, రమ్యకృష్ణ వంటి వారు అయితే బాగుండేది అన్నట్లుగా తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: