టాలీవుడ్ క్రేజీ బ్యానర్ లో లోకేష్ కనకరాజు సినిమా..!

Pulgam Srinivas
ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో జోరుగా వినబడుతున్న దర్శకుల పేర్లలో లోకేష్ కనకరాజు పేరు ఒకటి. ఈ దర్శకుడు సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మా నగరం మూవీ తో దర్శకుడిగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కార్తీ హీరోగా తెరకెక్కిన ఖైదీ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి లోకేష్ కనకరాజు కు అదిరిపోయే రేంజ్ ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ద్వారా లోకేష్ కనకరాజు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఖైదీ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ ,  తళపతి విజయ్ హీరోగా మాస్టర్ సినిమాను తెరకెక్కించాడు. మాస్టర్ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే తాజాగా లోకేష్ కనకరాజు , లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా విక్రమ్ మూవీ ని తెరకెక్కించాడు. విక్రమ్ మూవీ జూన్ 3 వ తేదీన విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా లోకేష్ కనకరాజు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నడు.  లోకేష్ కనకరాజు మరి కొన్ని రోజుల్లో తళపతి విజయ్ హీరోగా మరో మూవీ ని మొదలు పెట్ట బోతున్నాడు.

ఈ సినిమా పూర్తి కాగానే లోకేష్ కనకరాజు తెలుగు లో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో లోకేష్ కనకరాజు ఒక సినిమా చేయడానికి కమిట్ అయినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రామ్ చరణ్ హీరోగా నటించే అవకాశం ఉన్నట్లు కూడా ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: