బాలయ్య మూవీకి ఆ ఏరియాలో అదిరిపోయే ఫైట్ ను చిత్రీకరించబోతున్న గోపీచంద్ మలినేని..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మూవీగా తెరకెక్కుతుంది . ఇప్పటికే ఈ మూవీ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఈ టీజర్ లో కూడా బాలకృష్ణ అదిరిపోయే మాస్ గెటప్ లో , అంతకుమించి మాస్ డైలాగ్ లతో ప్రేక్షకులను అలరించాడు .  

అలాగే ఈ మూవీ టీజర్ కూడా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటం తో ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది . ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని దర్శకుడు గోపీచంద్ మలినేని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు . అందులో భాగంగా కర్నూలు  కొండారెడ్డి బురుజు దగ్గర కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని గోపీచంద్ మలినేని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది . కొండారెడ్డి బురుజు నేపథ్యంలో ఇది వరకు ఒక్కడు సినిమాలో ఒక సన్నివేశాన్ని చిత్ర బృందం చూపించింది . ఆ సన్నివేశం సినిమాకే హైలెట్ గా నిలిచింది . ఈ మధ్య కాలంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు అలాగే రామ్ పోతినేని హీరో గా తెరకెక్కిన ది వారియర్ మూవీ లో కూడా కొండారెడ్డి బురుజు నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అలాగే గోపీచంద్ మలినేని కూడా కొండారెడ్డి బురుజు నేపథ్యంలో బాలకృష్ణ సినిమా కోసం అదిరిపోయే యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాకు హైలెట్ గా నిలిచే విధంగా చిత్రీకరించడం కోసం చిత్ర బృందం ప్రణాళికలను వేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: