నయనతార 75వ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ నయన తార గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నయన తార ప్రస్తుతం సౌత్ ఇండియా లోనే మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా తన కెరియర్ ను కొనసాగిస్తుంది. తమిళం లో నయన తార ను లేడీ సూపర్ స్టార్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారుn. 

నయనతార ప్రస్తుతం కమర్షియల్ సినిమాల్లో కంటే కూడా కథకు ప్రాధాన్యత ఉన్న లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ వస్తోంది . అందులో భాగంగా ఇప్పటికే నయనతార ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి మంచి విజయాలను కూడా బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది . ఇది ఇలా ఉంటే తాజాగా నయనతార , విజయ్ సేతుపతి , సమంత ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కర్మణి ర్యాంబో ఖతిజ  సినిమా లో ప్రధాన పాత్రలో నటించింది . ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టినప్పటికి , టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా నయన తార 75 వ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది .

ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ బ్యానర్ వారు ఈ మూవీ ని  అనౌన్స్ చేశారు . ఒక వీడియో తో నయనతార 75 వ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ను చిత్ర బృందం చేసింది . మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది . నీలేష్ కృష్ణా  ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తుండగా , జై మరియు సత్య రాజ్ లను ప్రస్తుతం మెయిన్ లీడ్ కాస్ట్ గా  చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: