సినిమాలకు గుడ్ బై చెప్పనున్న పూర్ణ.. నిజమేనా..?

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా ప్రేమ వివాహాలు చేసుకుని విడిపోయిన వారు చాలామంది ఉన్నారు. కానీ హీరోయిన్ పూర్ణ మాత్రం తమ తల్లిదండ్రులు చూసిన వారిని వివాహం చేసుకోబోతోంది.అల్లరి నరేష్ నటించిన సీమటపాకాయ్ చిత్రం ద్వారా మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ పూర్ణ ఆ తర్వాత లడ్డు బాబు, అవును, రాజుగారు గది తదితర చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా బాలకృష్ణతో కలిసి అఖండ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈమె తెలుగులోపాటు ఇతర భాషలలో సైతం నటించి మంచి నటిగా పేరుపొందింది. ఒకవైపు వెండితెరపై అలరిస్తూనే మరొకవైపు బుల్లితెరపై కూడా పరిశోలకు జడ్జిలుగా వ్యవహరిస్తూ ఉన్నది.

ఇదంతా ఇలా ఉండగా త్వరలోనే ఈ అందాల ముద్దుగుమ్మ తన వైవాహిక బంధం లోకి అడుగుపెట్టనుంది కొన్ని రోజుల క్రితం వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ ఆలీతో నిశ్చితార్థం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది . ఇక వీరికి సంబంధించి ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా గతంలో బాగా ట్రెండ్  గా నిలిచాయి. కానీ షాహిద్ పూర్ణాల వివాహం ఈ ఏడాది జరగబోతోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయాన్ని తాజాగా ప్రసారమైన ఒక టీవీ షోలో ఆమె తెలియజేసినట్లు సమాచారం.

పూర్ణ మ్యారేజ్ డేట్ తో పాటు తమ రిలేషన్షిప్ కు సంబంధించిన పలు విషయాలను కూడా తెలియజేసింది. ఇక పూర్ణది పెద్దలు కుదిరిచిన వివాహం అని పెళ్లయ్యాక తమ ఇద్దరు దుబాయిలో స్థిరపడతామని తెలియజేసింది కాగా యూఏఈ వేదికగా ఉన్న జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి తన కాబోయే భర్త  ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారని తెలియజేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మ సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నది. అయితే ఆమె మాత్రం తనకు తన భర్తకు అంగీకారమైతేనే నటిస్తానని లేదంటే లేదని తేల్చి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: