ఆ సినిమాతో చైతూ ఎంట్రీ ఇచ్చుంటే ఎప్పుడో స్టార్ అయ్యేవాడట?

Purushottham Vinay
సినిమా రంగంలో ఒక హీరో చేయాల్సన సినిమాను మరో హీరో చేయడం అనేది చాలా కామన్‌. అయితే ఆ సినిమా కనుక హిట్ అయితే ఫస్ట్ వదులుకున్న హీరో దురదృష్టం అంటారు.. ప్లాప్ కనుక అయితే అతడు చాలా లక్కీ అంటూ ఉండడం కామన్‌.ఈ క్రమంలోనే అక్కినేని వంశంలో మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ లవర్ బాయ్ నాగచైతన్య. నాగచైతన్యను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తన బ్యానర్లో తెరకెక్కిన జోష్ సినిమాతో వెండితెరకు చాలా గ్రాండ్‌గా పరిచయం చేశాడు. ఇక వాసువర్మ ఈ సినిమాకు దర్శకుడు.కాలేజ్ నేపథ్యం, గొడవలతో తెరకెక్కిన ఈ కథ విన్నవెంటనే దిల్ రాజుకు ఒక్కసారిగా నాగార్జున శివ సినిమా గుర్తుకు వచ్చిందట. ఇక ఈ టైప్‌లో సినిమా వచ్చి చాలా రోజులైంది కదా ? అని నచ్చడంతో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు చెప్పారట. ఇక అప్పుడు మగధీర సినిమా అండర్ ప్రాసెస్‌లో ఉంది. చరణ్‌కు కూడా ఈ కథ బాగా నచ్చింది. అయితే చిరంజీవికి కథ నచ్చినా కూడా మగధీర ఎంత భారీగా తెరకెక్కుతుందో ? తనకు తెలుసు.. ఇంత భారీ సినిమా తర్వాత ఈ సినిమా తీస్తే ఎంత వరకు కనెక్ట్ అవుతుందన్న దానిపై కొంత సందేహం వ్యక్తం చేయడంతో పాటు తర్వాత రోజు నిర్ణయం కూడా చెపుతానన్నారట.మరుసటి రోజు చిరు దిల్ రాజుకు స్వయంగా ఫోన్ చేసి నాగబాబుకు చెప్పమని సూచించడంతో అలాగే నాగబాబు కూడా కొన్ని సందేహాలు వ్యక్తం చేశారట.

చివరకు ఇదే కథను నాగార్జునకు చెప్పగా దెబ్బకు నాగ్ ఓకే చేయడంతో చైతు డెబ్యూ మూవీగా జోష్ వచ్చింది. అయితే ఇంతకంటే ముందు చైతును పరిచయం చేసేందుకు దిల్ రాజు నాగార్జున చుట్టూ బాగా తిరిగారట. సూపర్ హిట్ సినిమా కొత్తబంగారు లోకం సినిమాతో చైతును హీరోగా పరిచయం చేయాలన్నది దిల్ రాజు ప్లాన్‌.అయితే ఓ లెజెండ్రీ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా వస్తోన్న చైతుకు ఇంత సాఫ్ట్ కథ కన్నా కాస్త యూత్‌కు కనెక్ట్ అవ్వడంతో పాటు యాక్షన్ కూడా ఉండే కథ ఉంటే చాలా బాగుంటుందని నాగ్ చెప్పారట. అదే టైంలో అటు జోష్ కథను మెగా కాంపౌండ్ రిజెక్ట్ చేయడంతో అదే కథను కింగ్ నాగార్జునకు చెప్పారట. ఈ కథకు నాగ్ బాగా ఫిదా అయ్యి ఓటేయడంతో అలా చైతు డెబ్యూ మూవీగా జోష్ వచ్చి చేరింది. అయితే ఇక్కడే నాగ్ అంచనాలు తప్పాయి.బ్యాడ్‌లక్ ఏంటంటే దిల్ రాజు డెసిషన్ మేరకు వెళ్లి ఉంటే కొత్తబంగారు లోకం లాంటి సూపర్ హిట్ సినిమాతో యూత్‌కు పిచ్చగా కనెక్ట్ అయిపోతూ ఇక నాగచైతన్య ఎంట్రీ అనేది ఉండి ఉండేది. అయితే  ఇక జోష్ లాంటి ప్లాప్ సినిమాతో చైతు ఎంట్రీ ఇచ్చాడు. అదే ఇక కొత్తబంగారు లోకం సినిమాతో హిట్ కొట్టిన వరుణ్ సందేశ్ చాలా రోజుల వరకు అదే సినిమా పేరు చెప్పుకుని ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు.ఒకవేళ చైతూ ఆ సినిమా చేసుంటే ఖచ్చితంగా యూత్ లో భారీ ఫాలోయింగ్ ఏర్పడేది.అయిన ఇప్పుడు చైతూ మెల్ల మెల్లగా యూత్ లో తన క్రేజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: