చిరంజీవి కి ఓపెన్ ఆఫర్ ఇచ్చిన పృథ్వీరాజ్ !

Seetha Sailaja
ప్రేక్షకులకు ఓటీటీ లు అందుబాటులోకి వచ్చిన తరువాత అన్ని భాషల సినిమాలు ప్రేక్షకులు చూస్తూ ఉండటంతో అన్ని భాషల నటీనటుల పేర్లు జనానికి బాగా గుర్తు ఉంటున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులకు పృధ్వీరాజ్ సుకుమారన్ పేరు పరిచయం అవసరం లేదు.

‘పోలీస్ పోలీస్’ మూవీతో ఇతడు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. ఇతడు నటించిన ‘అయ్యప్పన్ కోషియం’ మూవీ మళయాళ వెర్షన్ ను ఓటీటీ లో తెలుగు ప్రేక్షకులు చాలమంది చూశారు. ఇతడు మంచి నటుడు మాత్రమే కాకుండా మంచి దర్శకుడు కూడ. ఇతడు దర్శకత్వం వహించిన ‘లూసీఫర్’ మూవీ మళయాళ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనాలు క్రియేట్ చేసింది.

ఇప్పుడు ఈ మూవీని తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తున్నాడు. వాస్తవానికి ఈ మూవీ రీమేక్ వెర్షన్ కు పృధ్వీరాజ్ చేత దర్శకత్వం చేయించాలని చిరంజీవి భావించాడట. అయితే ఆ ప్రపోజల్ సఫలం కాలేదు. ప్రస్తుతం పృధ్వీరాజ్ ‘లూసీఫర్ 2’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని చిరంజీవి అడిగితే తెలుగులో తాను చిరంజీవిని హీరోగా పెట్టి తానే రీమేక్ చేస్తాను అంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ‘సలార్’ మూవీలో నటిస్తున్న ప్రభాస్ ఆ మూవీలో పృధ్వీరాజ్ కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను క్రియేట్ చేయించి తన మూవీలో పృధ్వీరాజ్ ఉండాలని గట్టి పట్టుబట్టి తన పంతం నెగ్గించుకున్నాడు.

ప్రస్థుతం ఈ మళయాళ నటుడు క్రేజ్ మన టాప్ హీరోలకు కూడ బాగా సోకడంతో ఇతడికి భారీ పారితోషికాలు ఇచ్చి టాప్ యంగ్ హీరోలలో ఆఫర్లు ఇస్తున్నారు. ఇతడికి ప్రస్తుతం పెరిగిన మ్యానియాతో ప్రకాష్ రాజ్ జగపతి బాబులకు కొంతవరకు అవకాశాలు తగ్గుతున్నాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఇతడి ఓపెన్ ఆఫర్ కు చిరంజీవి ఎలా స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం రీమేక్ ల హవా నడుస్తోంది కాబట్టి రానున్న రోజులలో ‘లూసీఫర్ 2’ కూడ తెలుగులో రీమేక్ అయ్యే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: