లేడీ సూపర్ స్టార్ నయనతార పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తెలుగు, తమిళ్ భాషల్లొ ఎన్నో సినిమాలలో నటించి పాపులర్ అయ్యింది.. ఆమె చేసిన సినిమాలు అన్నీ మంచి హిట్ టాక్ ను అందుకోవడం తో ప్రతి ఒక్కరూ ఆమె తో సినిమాలు చెసెందుకు క్యూ కడుతున్నారు.. ఈమె రెమ్యునరేషన్ కూడా స్టార్ హిరోలకు తక్కువ కాదు..అయితే గత కొన్నెల్లుగా అమ్మడు పెళ్ళి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ చివరికి ఓ డైరెక్టర్ ను ప్రెమించి పెళ్ళి చేసుకుంది.
కోలీవుడ్ లవ్బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్ ఇటీవల వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.తర్వాత నూతన దంపతులు దేవుడి ఆశీర్వాదం కోసం తిరుమల క్షేత్రానికి సైతం వెళ్లి వచ్చారు. అంతేకాదు, తమ పెళ్లి అందరికీ గుర్తుండిపోయేలా సుమారు లక్ష మందికి విందు భోజనాలు అందించారు. ఆనంతరం థాయ్లాండ్కు హానీమూన్ వెళ్లిన ఈ కొత్త దంపతులు నిన్న తిరిగి వచ్చారు. హానీమూన్ నుంచి వచ్చిరాగే నవ వధువు నయన్ షూటింగ్ సెట్లో అడుగు పెట్టిందట. నయన్ జావాన్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే..
అట్లీ, బాలీవుడ్ బాద్షా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం ముంబైలో షూటింగ్ను జరుపుకుంటోంది. ఇక హానీమూన్ నుంచి తిరిగొచ్చిన వెంటనే నయన్ షూటింగ్ కోసం ముంబైలో వాలిపోయిందట. ఈ రోజు జవాన్ షూటింగ్లో నయనతార పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా పెళ్లి అనంతరం తొలిసారి నయన్ షూటింగ్లో పాల్గొని సందడి చేసిందని తాజాగా వార్తలు వస్తున్నాయి. పెళ్లి అనంతరం షూటింగ్ కాస్తా బ్రేక్ ఇస్తుందని అంత అనుకున్నారు. అంతేకాదు ఇక సినిమాలకు కూడా బ్రేక్ ఇస్తుందని, ఒప్పుకున్న ప్రాజెక్ట్స్కు కూడా నయన్ కొత్త కండిషన్స్ పెడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా ఆమె జవాన్ షూటింగ్లో పాల్గొనడం వార్తల్లో నిలిచింది. చిరంజీవి సరసన కూడా ఓ సినిమా చేస్తుంది.. మొత్తానికి పెళ్ళి తర్వాత నుంచి నయన్ పేరు వైరల్ అవుతుంది.