సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. మలయాళ కుట్టి సోయగం వరుస సినిమాల తో దూసుకుపోతుంధి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల తో బిజీగా ఉన్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు, హిందీ సినిమాల తో తీరిక లేకుండా ఉన్న ఈ భామ ఇప్పుడెక్కడుందో తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటున్నారు.. ప్రస్తుతం ఈ అమ్మడు దుబాయ్ లో సేద తీరుతున్న సంగతి చాలా మందికి తెలియదు..
తన స్నేహితురాలు శిల్పారెడ్డి తో పాటు ఆమె సోదరి సాహిత్య రెడ్డితో చేరిపోయింది. వీరంతా కలిసి ఒక్కచోట సందడి చేసిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ స్టిల్ ను శిల్పారెడ్డి ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. ఫైనల్ గా ఊహించని విధంగా నా సోదరి సాహిత్య ను సామ్ కలవడం, సామ్ను సాహిత్య మీట్ అవడం అద్బుతం. నా ఇద్దరు ఫేవరేట్ స్త్రీలు. దేవా (సాహిత్య) ఎప్పుడూ సామ్ ఆంటీని కలుసుకోవడం చాలా సరదాగా ఉంటుంది.. అంటూ #dubaidaires హ్యాష్ ట్యాగ్ ను జతచేసింది శిల్పారెడ్డి..
విజయ్ దేవరకొండ, శివనిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న ఖుషీ చిత్రంలో నటిస్తోంది సమంత. దీంతోపాటు గుణశేఖర్ డైరెక్షన్ లో చేస్తున్న శాకుంతలం విడుదల కావాల్సి ఉంది. మరోవైపు ఫీ మేల్ సెంట్రిక్ ప్రాజెక్టు యశోద లో నటిస్తోంది. ఇవే కాకుండా హాలీవుడ్ ప్రాజెక్టు Arrangement of love సినిమాలో కూడా నటిస్తోంది.. ఏది ఏమైనా కూడా పుష్ప సినిమా లోని ఐటమ్ పాట జనాలను ఓ ఊపు ఊపెసింది.. ఆ పాట తో సమంత రేంజ్ పూర్తిగా మారిపొయింది. మరో వైపు వెబ్ సిరీస్ లను కూడా చేస్తుంది.. ఇక సామ్ దూకుడును ఆపడం ఎవ్వరి వల్ల కాదు.. ఇక ఫ్యూచర్ లో మళ్ళీ పెళ్లి అనేది చేసుకుంటుందా లేదా అన్నది చూడాలి..