ఇటీవల మలయాళ చిత్రం 'అయప్పమ్ కోషియం' తెలుగు రీమేక్ గా వచ్చిన చిత్రం 'భీమ్లా నాయక్' .ఇకపోతే సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీప్లే అందించారు.ఇకపోతే పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్ షోల నుంచి సూపర్ హిట్ టాక్ అందుకుంది. అంతేకాదు అటు యూఎస్ లోనూ 'భీమ్లా నాయక్'హవా కొనసాగింది.కాగా ఫిబ్రవరి 25న రిలీజ్ అయిన ఈ మూవీ రెండు తెలుగు రాప్ట్రాలతో పాటు యూఎస్ఏ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.ఇకపోతే తెలుగు రీమేక్ లో ప్రధాన పాత్రలో పవన్కళ్యాణ్, మరో బలమైన పాత్రలో రానా దగ్గుబాటి నటించారు.
అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక సౌత్ సినిమాలకు నార్త్ సైడ్ మంచి ఆదరణ ఉంది.కాగా దీంతో సౌత్ సినిమాలను రీమేక్ చేసేందుకు బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ముందుకు వస్తున్నారు.అయితే 'జెర్సీ, ఆకాశమే హద్దురా' లాంటి చిత్రాలను రీమేక్ చేశారు. ఇదిలా ఉంటె తాజాగా 'భీమ్లా నాయక్' రీమేక్ పై క్రేజీ బజ్ వినిపిస్తోంది.ఇకపోతే చాలా మార్పులతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు హిందీలోనూ రీమేక్ కు సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ఈ సినిమా రీమేక్ హక్కులను తీసుకున్నారు.
అంతేకాక తాజాగా దర్శకుడి పేరు బయటికి వచ్చింది. పోతే బాలీవుడ్ స్టార్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ అక్టోబర్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు.అయితే హిందీ రీమేక్ కు సంబంధించిన అప్డేట్స్ రావాల్సి ఉంది.ఇక తెలుగు.. భీమ్లా నాయక్ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు.కాగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఇకపోతే పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైనర్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్తో నిర్మించారు. కాగా మాస్ ఎంటర్టైనర్గా 'భీమ్లా నాయక్' చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక పాజిటివ్ మౌత్ టాక్ అందుకుని అదరగొట్టింది..!!