రూమర్స్ పై స్పందించిన కియారా అద్వానీ...!!

murali krishna
భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కియారా అద్వానీ అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించారట.


ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయకపోవడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది..బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్న కియారా తిరిగి శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట.


ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె ప్రేమ బ్రేకప్ గురించి పెద్ద ఎత్తున వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. గత కొంత కాలం నుంచి కియారా బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నారని త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్దఎత్తున వార్తలు కూడా వచ్చాయి. అయితే గత కొంత కాలం నుంచి వీరిద్దరి ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు షికార్లు చేయడంతో ఈ వార్తలపై వీరిద్దరూ ఏమాత్రం కూడా స్పందించలేదు.


తాజాగా కియారా అద్వానీ తన ప్రేమ బ్రేకప్ గురించి వస్తున్న రూమర్లపై స్పందించారు.ప్రస్తుతం తనకు ఇలాంటి వార్తల గురించి పట్టించుకునే అంత తీరిక ఏమాత్రం కూడా లేదని ప్రస్తుతం తన దృష్టి మొత్తం తన కెరియర్ పై పెట్టానని తెలిపారు.ఇక తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ తను కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఇష్టపడతానని తెలిపారట. ఒక నటిగా ఇండస్ట్రీలో తానేమిటో నిరూపించుకోవడానికి కోసమే ఇక్కడికి వచ్చానని ప్రస్తుతం అదే ప్రయత్నాల్లో ఉన్నానని ఈమె తెలిపారు.


ఇక ఈమె కెరీర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు తెలుగు,హిందీ భాషలలో నటించిన ఈమె త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.ఇకపోతే రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ తో ప్రస్తుతం ఈమె చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోందట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: